ఈ ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా మళ్లీ వచ్చి కచ్చితంగా ఆడతాడని, అయితే ఆరంభంలో కొన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చని టీమ్ఇండియా మాజీ కీపర్ దీప్దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. గతవారం సీఎస్కే జట్టులో నుంచి సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్కు ఆడటం లేదని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో వారి స్థానాలను భర్తీ చేసే విషయంపై స్పందించిన దీప్దాస్ పైవిధంగా మాట్లాడాడు.
"ఐపీఎల్లో రైనా మళ్లీ ఆడతాడనే నమ్మకం నాకుంది. ఐపీఎల్ నియమాలు, క్వారంటైన్లో ఉండటం, కరోనా పరీక్షలు చేయించుకోవడం లాంటివాటితో మొదట్లో కొన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు. అయితే, తర్వాత మాత్రం ఆడతాడని విశ్వసిస్తున్నా. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ అతడి స్థానాన్ని వేరే ఆటగాడితో భర్తీ చేయకపోయినా నేను ఆశ్చర్యపోను."