ఐపీఎల్ 2021 నిర్వహణ పనులు ప్రారంభమైపోయాయి. ఈ మెగాలీగ్లో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీలు .. తాము అంటిపెట్టుకున్న ఆటగాళ్లు, ట్రేడింగ్ విండో వివరాలను సమర్పించేందుకు గడువు తేదీని ప్రకటించింది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. జనవరి 21లోగా అంటిపెటుకున్న ఆటగాళ్లు, ఫిబ్రవరి 4వ తేదీలోగా ట్రేడింగ్ విండో వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని లీగ్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు.
ఐపీఎల్: ఆటగాళ్ల రిటెన్షన్కు ఆఖరు తేదీ ఇదే - ఐపీఎల్ 2021
ఈ ఏడాది మెగాలీగ్లో పాల్గొనే ఫ్రాంచైజీలు.. తాము అంటిపెట్టుకున్న ఆటగాళ్లు, ట్రేడింగ్ విండో వివరాలను జనవరి 21, ఫిబ్రవరి 4వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించింది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. అలాగే వేలంపాటలో ఆటగాళ్ల కొనుగోలు విషయమై రూ.85 కోట్లు మించి ధర వెచ్చించరాదని సదరు జట్ల యాజమాన్యాలకు సూచించింది.
![ఐపీఎల్: ఆటగాళ్ల రిటెన్షన్కు ఆఖరు తేదీ ఇదే ipl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10157156-537-10157156-1610030220946.jpg)
ఐపీఎల్
కాగా, ఫిభ్రవరి మూడో వారంలో మినీ వేలంపాట జరగనుంది. అయితే ఈ ఆక్షన్లో సంబంధిత ఫ్రాంచైజీలు.. ఆటగాళ్లను కొనుగోలు చేసే విషయమై రూ.85 కోట్లు మించి ధర వెచ్చించరాదని సదరు ఫ్రాంచైజీలకు సూచించారు పటేల్.
ఇదీ చూడండి : 'ఆ సమయంలో కన్నీరు ఆపుకోలేకపోయా'