టీమిండియా మాజీ బ్యాట్స్మన్, తూర్పు దిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్కు అరుదైన గౌరవం దక్కింది. దిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలోని ఓ స్టాండ్కు డీడీసీఏ గంభీర్ పేరు పెట్టింది. ఈ స్టాండ్ను మంగళవారం గంభీర్ ఆవిష్కరించాడు. దీనికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
"అరుణ్జైట్లీ నాకు తండ్రిలాంటి వారు. అరుణ్జైట్లీ స్టేడియంలో ఓ స్టాండ్కు నా పేరు పెట్టినందుకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. నాకు అండగా నిలిచినందుకు అపెక్స్ కౌన్సిల్, స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులకు కతృజ్ఞతలు"
-గంభీర్, టీమిండియా మాజీ ఆటగాడు