తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2019, 9:17 PM IST

Updated : Sep 30, 2019, 9:37 AM IST

ETV Bharat / sports

ఫిరోజ్​ షా కోట్ల ఇకపై 'అరుణ్​ జైట్లీ స్టేడియం​'

దిల్లీలోని ఫిరోజ్​ షా కోట్ల స్టేడియం పేరు అరుణ్ జైట్లీ స్టేడియంగా మారింది. ప్రేక్షకులు కూర్చునే  ఓ స్టాండ్​కు కోహ్లీ పేరును పెట్టింది దిల్లీ క్రికెట్ అసోషియేషన్.

కోహ్లీ

దేశ రాజ‌ధాని దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం పేరు అరుణ్ జైట్లీ స్టేడియంగా మారింది. దిల్లీ క్రికెట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జైట్లీ సేవ‌ల‌ను వారు గుర్తు చేసుకున్నారు.

ప్రేక్ష‌కులు కూర్చునే ఓ స్టాండ్‌కు విరాట్ కోహ్లీ పేరును పెట్టారు. ఈ ఘనత సాధించిన యువ క్రికెటర్​గా కోహ్లీ ఘనత సాధించాడు. ఇంతకుముందు దిల్లీ క్రికెటర్లు మొహిందర్ అమర్​నాథ్, బిషన్ సింగ్ బేడీలు ఈ ఘనత సాధించినా.. వారి రిటైర్మెంట్​ తర్వాత ఇది సాధ్యమైంది.

ఇవీ చూడండి.. అవన్నీ పుకార్లే : ధోనీ భార్య సాక్షి సింగ్

Last Updated : Sep 30, 2019, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details