తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐసీసీ, ముందు ఆ విషయంపై అవగాహన కల్పించాలి'

జాతివివక్ష గురించి యువక్రికెటర్లకు అవగాహన పెంచాలని, తద్వారా ఆటగాళ్లందరిని సమానంగా చూసే ఆలోచన అలవడుతుందని చెప్పాడు విండీస్ మాజీ సారథి డారెన్​ సామి.

By

Published : Jun 22, 2020, 12:04 PM IST

darensamy
డారెన్​ సామి

యువ క్రికెటర్లకు.. డోపింగ్​, అవినీతి అంశాలతో పాటు జాతి వివక్షపై గురించి అవగాహన పెంచాలని ఐసీసీకి సూచించాడు వెస్టిండీస్​ మాజీ సారథి డారెన్​ సామి. యువ క్రికెటర్లు దీని గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నాడు. తద్వారా క్రికెట్​లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరిని సమానంగా చూసే ఆలోచనా ధోరణి, తోటి క్రికెటర్లకు అలవాటవుతుందని చెప్పుకొచ్చాడు. ఐసీసీ నిర్వహించిన ఆన్​లైన్​ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.

"యువక్రికెటర్లకు డోపింగ్​, అవినీతి అంశాలతో పాటు జాతివివక్ష గురించి అవగాహన పెంచాలి. ఎందుకంటే క్రికెట్​లో భిన్నవర్గాలు, ప్రాంతాలు, నేపథ్యాలకు చెందిన వారు వస్తుంటారు. కాబట్టి ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఫలితంగా ప్రతిఒక్కరిని సమానంగా చూసే వ్యక్తిత్వం ఆటగాళ్లలో అలవడుతుంది"

-డారెన్​ సామి, వెస్టిండీస్​ మాజీ సారథి

ఇటీవలే మాట్లాడిన సామి.. తాను ఐపీఎల్ ఆడినప్పుడు​ సన్​రైజ​ర్స్​ హైదరాబాద్​ జట్టులోని కొందరు క్రికెటర్లు, తనపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారని చెప్పాడు. తర్వాత ఈ విషయంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడిచింది.

ఐసీసీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషాన్ గుహా(ఇంగ్లాండ్), జేపీ డుమిని(అఫ్రికా), టామ్​ మూడీ(ఆస్ట్రేలియా), బజీద్​ ఖాన్​(పాకిస్థాన్​)లు సామి వ్యాఖ్యలను సమర్థించారు.

ఇది చూడండి : 'ఐపీఎల్​లో నాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు'

ABOUT THE AUTHOR

...view details