తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2020, 6:43 PM IST

Updated : Jan 3, 2020, 7:27 PM IST

ETV Bharat / sports

హైదరాబాద్​లో 'రోహిత్' మైదానం.. హిట్​మ్యాన్​ భూమిపూజ

భారత స్టార్​ క్రికెటర్​ రోహిత్​శర్మ, తన సతీమణి రితికతో కలిసి హైదరాబాద్​లోని కన్హా శాంతివనంలో సందడి చేశాడు. ఆధ్యాత్మిక గురువు కమలేశ్​ పటేల్​ను కలిశారు ఈ దంపతులు. అనంతరం చెగూర్​లో క్రికెట్​ మైదానం, శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశాడు హిట్​మ్యాన్​.

Cricketer Rohit Sharma laid the foundation stone for a cricket stadium and training centre at 'Heartfulness Institute' hyderabad
హైదరాబాద్​లో 'రోహిత్' మైదానం.. హిట్​మ్యాన్​ భూమిపూజ

హైదరాబాద్​లో 'రోహిత్' మైదానం.. హిట్​మ్యాన్​ భూమిపూజ

టీమిండియా క్రికెటర్​ రోహిత్​శర్మ నేడు హైదరాబాద్​కు వచ్చాడు. చేగూర్​ ప్రాంతంలోని 'హార్ట్​ఫుల్​నెస్​ ఇన్​స్టిట్యూట్'​ వద్ద క్రికెట్​ మైదానం, శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమానికి తన సతీమణి రితికతో కలిసి హాజరయ్యాడు. దాజీగా పిలిచే ఆధ్యాత్మిక గురువు కమలేశ్​ పాటిల్​ను కలిశారు ఈ దంపతులు. కన్హా శాంతివనం ప్రధాన కార్యాలయం వద్ద ఈ వేడుక జరిగింది. నూతనంగా నిర్మించ తలపెట్టిన ఈ మైదానానికి 'రోహిత్​ శర్మ క్రికెట్​ స్టేడియం'గా నామకరణం చేశారు.

"కన్హా శాంతివనంలోకి అడుగుపెట్టగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. పాజిటివ్​ భావన కలిగింది. ప్రకృతితో అనుబంధం ఉంటేనే అలా ఉంటుంది. హార్ట్​ఫుల్​నెస్​ యోగా కూడా బాగా ఉపయోగపడుతోంది. యోగా వల్ల మనుసు చాలా తేలికగా అనిపిస్తోంది."

-- రోహిత్​శర్మ, క్రికెటర్​

మైదాన శంకుస్థాపనకు హాజరైన రోహిత్​, రితిక

హార్ట్​ఫుల్​నెస్​ అనేది రాజయోగాలోని ఒక రకం. ఇది 20వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1945లో శ్రీ రామ్​ చంద్ర మిషన్​ ద్వారా ఇది వ్యాప్తి చెందింది.

జనవరి 5 నుంచి శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న 3 మ్యాచ్​ల టీ20 సిరీస్​కు రోహిత్​కు విశ్రాంతి నిచ్చారు సెలక్టర్లు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ దృష్టిలో పెట్టుకొని కోహ్లీ, రోహిత్​కు ఒత్తిడి లేకుండా ఒక్కొక్కరికి ఒక్కో సిరీస్​కు విశ్రాంతినిస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్​తో సిరీస్​కు విరాట్​ను ఎంపిక చేయలేదు టీమిండియా యాజమాన్యం.

Last Updated : Jan 3, 2020, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details