తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2020, 9:46 AM IST

ETV Bharat / sports

త్రీటీ క్రికెట్: ఒకే మ్యాచ్​లో మూడు జట్లు

టీ20, టీ10, ద హండ్రెడ్​ లీగ్​ తర్వాత క్రికెట్​ ప్రపంచంలో మరో కొత్త ఫార్మాట్​ పరిచయం కాబోతోంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్​లో రెండు జట్లు పాల్గొనడం ఆనవాయితీ. అయితే ఈసారి ఒకే మ్యాచ్​లో మూడు టీమ్​లు ఆడనున్నాయి. ఒక్కో జట్టులో కేవలం 8 మందికి మాత్రమే స్థానం ఉంటుంది. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టుకు ట్రోఫీని కాకుండా బంగారు, వెండి, కాంస్యం పతకాలను బహుమతిగా అందిస్తారు. ఇవేమి కొత్త రూల్స్​ అనుకుంటున్నారా.. అయితే జూన్​ 27న క్రికెట్​ దక్షిణాఫ్రికా నిర్వహించబోతోన్న '3 టీమ్​ క్రికెట్​' గురించి తెలుసుకోవాల్సిందే.

Cricket to resume in South Africa on June 27 with innovative event, confirms CSA
క్రికెట్​లో కొత్త ఫార్మాట్​.. రూల్స్​ ఏంటో తెలుసా..!

కరోనా కారణంగా మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రీడాటోర్నీలు వాయిదా పడ్డాయి. లాక్​డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పుడిప్పుడే మ్యాచ్​ల నిర్వహణకు కొన్ని దేశాలు పూనుకుంటున్నాయి. తాజాగా క్రీడా కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది దక్షిణాఫ్రికా. ఈ క్రమంలో జూన్​ 27 నుంచి '3 టీమ్​ క్రికెట్​' అనే వినూత్న పోటీ నిర్వహించనుంది సఫారీ క్రికెట్​ బోర్డు. అయితే ఇందులో జరిగే ఒకే మ్యాచ్​లో మూడు జట్లు పోటీ పడటం గమనార్హం.​ సెంచూరియన్​లోని సూపర్​స్పోర్ట్​ స్టేడియం ఈ మ్యాచ్​కు వేదిక కానుంది.

క్రికెట్​ దక్షిణాఫ్రికా ప్రకటించిన నివేదిక ఆధారంగా జూన్ 27న నిర్వహించనున్న టోర్నీలో మూడు జట్లు పోటీ పడనున్నాయి. లాక్​డౌన్​ తర్వాత దక్షిణాఫ్రికాలో ప్రత్యక్ష ప్రసారమయ్యే తొలి క్రీడాకార్యక్రమం ఇదే కావడం విశేషం. ఈ ఫార్మాట్​లో తొలి ప్రయత్నంగా స్వదేశానికి చెందిన 24 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకుని ఈ మ్యాచ్​ను నిర్వహించనున్నారు. ఒక్కొక్క జట్టులో 8 మంది ఆటగాళ్లు మాత్రమే భాగం కానున్నారు.

ఒకే మ్యాచ్​లో మూడు టీమ్​లు

సాలిడారిటీ కప్​ కోసం ఈగల్స్, కింగ్​ ఫిషర్స్​, కైట్స్.. ఈ మూడు​ జట్లు పోటీ పడనున్నాయి. ఈగల్స్​ టీమ్​కు కెప్టెన్​గా ఏబీ డివిలియర్స్​, కింగ్​ ఫిషర్స్​ జట్టు కెప్టెన్​గా రబాడా, కైట్స్​ టీమ్​కు సారథిగా ప్రస్తుత దక్షిణాఫ్రికా టీమ్​ కెప్టెన్​ డికాక్​ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కొత్త ఫార్మాట్​ క్రికెట్​ అభిమానుల్లో నూతనోత్తేజాన్ని తిరిగి తెస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ గ్రేమ్​ స్మిత్​.

"ప్రపంచవ్యాప్తంగా టోర్నీలన్నీ ఆగిపోవడం వల్ల క్రికెట్​ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అదే విధంగా క్రికెటర్లందరూ ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడతామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ కారణంగా క్రికెట్​ దక్షిణాఫ్రికా సాలిడారిటీ కప్​ అంటూ వినూత్న పోటీని నిర్వహించబోతోంది. ఈ ఫార్మాట్​ కోసం పనిచేయడం ఆసక్తిగానూ.. ఆనందంగానూ ఉంది.".

- గ్రేమ్ స్మిత్​, క్రికెట్​ దక్షిణాఫ్రికా డైరెక్టర్​

'3 టీమ్ క్రికెట్​' ఫార్మాట్​ రూల్స్​:

  • మూడు జట్లు ఒకే మ్యాచ్​లో పోటీ పడనున్నాయి. ఒక్కొక్క టీమ్​లో 8 మంది ఆటగాళ్లు ఉంటారు.
  • మొత్త 36 ఓవర్లుంటాయి. 18 ఓవర్ల చొప్పున రెండు భాగాలుగా విడదీశారు.
  • ఒక ఇన్నింగ్స్​లో ఒక జట్టు మాత్రమే బ్యాటింగ్​ చేయాల్సి ఉంది. ఒక్కో టీమ్​ 12 ఓవర్లు బ్యాటింగ్​ చేయనుంది.
  • తొలుత ఎవరు బ్యాటింగ్​ చేయాలా అని డ్రా ద్వారా నిర్ణయిస్తారు.
  • ఒక్కో జట్టు బ్యాటింగ్​ చేసే 12 ఓవర్లలో.. తొలి 6 ఓవర్లకు ఒక జట్టు, మిగిలిన ఆరు ఓవర్లకు మరో జట్టు ఫీల్డింగ్​ చేస్తుంది.
  • జట్టులో ఉండే 8 మంది ఆటగాళ్లలో 7 మంది ఔట్​ అయితే చివరిగా ఉన్న బ్యాట్స్​మన్​ ఒంటరిగా ఆడవచ్చు. అయితే అతను సరిసంఖ్య పరుగులే చేయాల్సి ఉంటుంది (అంటే 2,4,6 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంటుంది).
  • అత్యధికంగా ఒక్క బౌలర్​ 3 ఓవర్ల వరకు వేయవచ్చు.
  • ఎవరైతే ఎక్కువ పరుగులు చేస్తారో వారే విజేతలుగా నిలుస్తారు.
  • అత్యధిక పరుగులు చేసిన జట్టుకు బంగారాన్ని.. ఆ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన టీమ్​కు వెండి.. మిగిలిన చివరి జట్టుకు కాంస్య పతకాలను బహుమతిగా ఇవ్వనున్నారు.

జట్ల వివరాలు:

కింగ్‌ఫిషర్స్ టీమ్​: రబాడా (కెప్టెన్​), డుప్లెసిస్, క్రిస్ మోరిస్, తబ్రేజ్ షంసీ, రీజా హెండ్రిక్స్, జన్నెమాన్ మలన్, హెన్రిచ్ క్లాసన్, గ్లెంటన్ స్టుర్మాన్.

కైట్స్​ టీమ్​: డికాక్ (కెప్టెన్​), డేవిడ్ మిల్లర్, బవుమా, ఎన్రిచ్ నోర్ట్జే, డ్వేన్ ప్రిటోరియస్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, జెజె స్మట్స్, లూథో సిపామ్లా.

ఈగల్స్ జట్టు:ఏబీ డివిలియర్స్ (కెప్టెన్), మర్కరమ్, లుంగిసాని ఎంగిడి, ఆండిలే, ఫెహ్లుక్వాయో, రాస్సీ వాన్ డెర్ డుసెన్, జూనియర్ డాలా, కైల్ వెర్రిన్నే, సిసాండా మగాలా.

ఇదీ చూడండి... 'కోహ్లీ లాంటి లక్షణాలే బెన్​స్టోక్స్​లోనూ'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details