తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 వాయిదా పడితే భారీ 'ఆర్థిక కష్టాలు' తప్పవు - ICC T20 World Cup

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితే.. తాము భారీ ఆర్థిక నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు క్రికెట్ ఆస్ట్రేలియా​ సీఈవో కెవిన్ ​రాబర్ట్స్​. రూ.400 కోట్లకుపైనే నష్టం రావచ్చని చెప్పారు.

Cricket Australia
టీ20 వాయిదా పడితే భారీ 'ఆర్థిక కష్టాలు' తప్పవు

By

Published : May 29, 2020, 2:48 PM IST

ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్​కప్​ను వాయిదా వేస్తే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు క్రికెట్ ఆస్ట్రేలియా​ సీఈవో కెవిన్ ​రాబర్ట్స్. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్​-నవంబర్​ మధ్య ఈ మెగాటోర్నీ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రవాణా ఆంక్షల కారణంగా ఈ టోర్నీ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.

ప్రేక్షకులతో టీ20 ప్రపంచకప్​ స్టేడియం

"అక్టోబర్​-నవంబర్​ నాటికి పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నాం. ఒకవేళ టోర్నీ జరగకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూ.400 కోట్లపైనే నష్టం వాటిల్లే ప్రమాదముంది.

-కెవిన్ ​రాబర్ట్స్

టోర్నీ కనీసం ప్రేక్షకులు లేకుండా నిర్వహించినా.. ఆర్థిక నష్టం కొంతమేర తగ్గుతుందని అభిప్రాయపడింది ఆసీస్​ బోర్డు. అయితే ఈ ప్రపంచకప్​ నిర్వహణపై జూన్​ 10 తర్వాత నిర్ణయం ప్రకటించనుంది ఐసీసీ.

ఇదీ చూడండి:ఐపీఎల్​పై ఆశలు.. టోర్నీకి తగ్గట్లు ఆసీస్​ బోర్డు షెడ్యూల్​!

ABOUT THE AUTHOR

...view details