బీసీసీఐకి కరోనా వైరస్ విచిత్రమైన పరిస్థితులను పరిచయం చేస్తోంది. ఇప్పటికే కొవిడ్-19 ముప్పుతో ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్ మ్యాచులన్నీ వాయిదా వేసింది. తాజాగా ముంబయిలోని ప్రధాన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులందరినీ మంగళవారం నుంచి ఇంటివద్ద నుంచే పని చేయాలని ఆదేశించింది.
"కొవిడ్-19 మహమ్మారి వల్ల వాంఖడే స్టేడియం వద్దనున్న ప్రధాన కార్యాలయం మూసివేస్తున్నామని ఉద్యోగులందరికీ తెలిపాం. మంగళవారం నుంచి అందరూ ఇంటివద్ద నుంచే పనిచేయాలని ఆదేశించాం."