కరోనా ప్రభావంతో ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్) వాయిదా పడింది. ఈనెల 29న ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీ... వచ్చే నెల 15 నుంచి మొదలు కానుంది. విదేశీ క్రికెటర్ల ఇక్కడికి వచ్చే విషయం మాత్రం సందిగ్ధంలోనే ఉంది. పలు దేశాల బోర్డులు తమ ఆటగాళ్లను పంపించాలా? వద్దా? అని పునరాలోచనలో పడ్డాయి. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ నిర్ణయాన్ని క్రికెటర్లకే వదిలేసింది.
"మన పరిస్థితి ఇంకా ఏం మారలేదు. ప్రభుత్వం, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాలకు అనుగుణంగా నడుచుకుంటాం. ఇక ఐపీఎల్లో ఆడాలా? వద్దా? అనే విషయాన్ని ఆటగాళ్లే నిర్ణయించుకుంటారు."