తెలంగాణ

telangana

గాయపడిన విద్యార్థులను పట్టించుకోండి: ఇర్ఫాన్​

By

Published : Dec 16, 2019, 12:47 PM IST

పౌర చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ గాయపడిన జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులను పట్టించుకోవాలని క్రికెటర్​ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. ఈ ఘటనలో దాదాపు 60 మంది గాయపడ్డారు.

Concerned about students of Jamia: Irfan Pathan
గాయపడిన విద్యార్థులను పట్టించుకోండి: ఇర్ఫాన్​

పార్లమెంటులో పౌరసత్వ బిల్లు ఆమోదంపై జరుగుతున్న ఆందోళనలపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. నిరసనల్లో గాయపడిన జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులను పట్టించుకోవాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.

"రాజకీయారోపణలు ఎప్పుడూ ఉండేవే. నిరసనల్లో గాయపడిన జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులను పట్టించుకోవాలి. దేశమంతా ఈ అంశంపై దృష్టిసారించాలి" -ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా క్రికెటర్.

దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో విద్యార్థులుఆదివారంఆందోళన చేశారు. ఈ నిరసనల్ని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనలో దాదాపు 60 మంది విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు.

ఇదీ చదవండి: 'జడేజా రనౌట్​పై అప్పీల్ చేశాం.. అంపైర్ చూడలేదు'

ABOUT THE AUTHOR

...view details