తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శికి షోకాజ్​ నోటీసులు..! - షోకాజ్‌ నోటీసు

అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ), ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) సమావేశాలకు హాజరుకాలేదు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి. ఈ విషయంపై ఆయనకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది బోర్డు పాలకుల కమిటీ (సీఓఏ).

బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శికి షోకాజ్​ నోటీసులు..!

By

Published : Sep 8, 2019, 8:24 PM IST

Updated : Sep 29, 2019, 10:08 PM IST

బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరికి ఊహించని షాక్​ తగిలింది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ క్రికెట్​ మండలి, ఆసియా క్రికెట్ మండలి సమావేశాలకు హాజరుకాకపోవడంపై ఆగ్రహించింది బోర్డు పాలకుల కమిటీ. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సమావేశాలకు గైర్హాజరు అవ్వడమే కాకుండా దానికి సంబంధించిన సమాచారాన్ని బీసీసీకి తెలియజేయకుండా దాచారాని అందులో పేర్కొంది.

బీసీసీఐకి ఛాన్స్​ పోయింది..!

ఐసీసీ భేటీ లండన్‌లో జులై 14 నుంచి 20 మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదన్న సమాచారాన్ని కేవలం రెండు రోజుల ముందు (జులై 12న) మెయిల్‌ చేశారని బీసీసీఐ పాలకుల కమిటీకి చెప్పింది ఐసీసీ. తక్కువ సమయమే ఉండటం వల్ల తన స్థానంలో వేరే ప్రతినిధిని పంపలేక పోయానని అమితాబ్​ చెప్పినట్లు అంతర్జాతీయ క్రికెట్​ మండలి వెల్లడించింది. దీని వల్ల ఆ భేటీలో బీసీసీఐకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అభిప్రాయపడింది.

అమితాబ్‌ చౌదరి చర్య వల్ల బీసీసీఐ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని... ఈ విషయంపై కచ్చితంగా ఆయన వివరణ తీసుకోవాలని బీసీసీఐకు సూచించింది ఐసీసీ.

ఇదీ చదవండి...

Last Updated : Sep 29, 2019, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details