తెలంగాణ

telangana

By

Published : Jun 26, 2019, 7:35 PM IST

ETV Bharat / sports

క్రిస్​ గేల్ వీడ్కోలు పలికేది అప్పుడే..!

కరీబియన్ విధ్వంసకర బ్యాట్స్​మెన్ క్రిస్​గేల్.. త్వరలో జరిగే టీమిండియా సిరీస్​ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ప్రపంచకప్​లో విండీస్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

క్రిస్​ గేల్ వీడ్కోలు పలికేది అప్పుడే..!

విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ రిటైర్మెంట్​పై స్పష్టతనిచ్చాడు. స్వదేశంలో టీమిండియాతో జరిగే వన్డే, టెస్టు సిరీస్​ తనకు చివరిదని వెల్లడించాడు. ఆగస్టు-సెప్టెంబరులో ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

ప్రపంచకప్​ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని కొన్ని రోజుల ముందు వెల్లడించాడీ క్రికెటర్. కానీ గురువారం భారత్​తో మ్యాచ్​ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్

"ఇది ముగింపు కాదు. ఇంకొన్ని మ్యాచ్​లు ఆడతాను. అది ఇంకో సిరీస్​ కావొచ్చు. ఏం జరుగుతుందో చుద్దాం. భారత్​తో జరిగే వన్డే, టెస్టు సిరీస్​ల్లో ఆడొచ్చు. ప్రపంచకప్​ తర్వాత నా ప్లాన్ ఇదే." -క్రిస్​ గేల్, వెస్టిండీస్ క్రికెటర్

భారత్​ జట్టుపై గేల్ తన చివరి సిరీస్​ ఆడతాడని జట్టు మేనేజర్ ఫిలిప్ స్పూనర్ ధ్రువీకరించారు.

ఇప్పటివరకు 103 టెస్టులాడిన గేల్ 7,215 పరుగులు... 294 వన్డేల్లో 10,435 పరుగులు.. 58 టీ20ల్లో 1,627 రన్స్ చేశాడు.

వెస్టిండీస్​ పర్యటనలో మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. వీటితో పాటే టెస్టుల్లోనూ తలపడనుంది టీమిండియా. ఆగస్టు 3- సెప్టెంబరు 3 వరకు ఈ సిరీస్ జరగనుంది.

ఇది చదవండి: WC19: గేల్ కవ్వింపు- రూట్ చిరునవ్వు

ABOUT THE AUTHOR

...view details