టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుతో పాటు అతడి ప్రవర్తనపై వస్తున్న ఆరోపణలపై అతడి మొదటి గురువు రాజ్కుమార్ శర్మ స్పందించారు. ఆటలో దూకుడుగా ఆడినా.. కోహ్లీ దుష్ప్రవర్తనకు లోనవ్వలేదని తెలిపారు.
"కోహ్లీ దూకుడును అందరూ అభినందించారు. అదే అతడికి బలమని నేను నమ్ముతాను. కానీ దూకుడుకి, దుష్ప్రవర్తనకు ఒక గీత ఉంటుంది. దాన్ని ఎప్పుడూ దాటే ప్రయత్నాన్ని అతడు చేయలేదు. కోహ్లీ అద్భుత ఆటగాడు. బాగా బ్యాటింగ్ చేస్తున్నా ఔట్ అవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో తన పూర్తి సామర్థ్యాన్ని చూపిస్తాడని నమ్ముతున్నా."