దెబ్బ తగిలినప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడానికన్నా.. ఆ నొప్పిని భరించడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని అంటున్నాడు టీమ్ఇండియా క్రికెటర్ పుజారా. అందుకే గబ్బా టెస్టులో చాలా దెబ్బలు తగిలినప్పటికీ వెనుదిరగకుండా ప్రత్యర్థులను ఎదుర్కోగలిగానని చెప్పాడు. ఆట కోసం ఎంతటి కష్టానైన్నా భరించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని వెల్లడించాడు.
"నాకు చిన్నప్పటి నుంచి దెబ్బ తగిలినప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకునే అలవాటు లేదు. అందుకే ఎంతటి నొప్పినైనా భరించగలను. ఎక్కువ సేపు ఆడాల్సి వచ్చినప్పుడు గాయాలు తగిలే అవకాశముంటుంది. అందుకు సిద్ధపడే బ్యాటింగ్ చేస్తా."
-పుజారా, టీమ్ఇండియా క్రికెటర్.