తెలంగాణ

telangana

By

Published : Mar 5, 2021, 11:02 AM IST

ETV Bharat / sports

బక్సమ్​ టోర్నీ: సెమీస్​లోకి సతీష్​, ఆశిష్​

బక్సమ్​ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు సత్తా చాటారు. సతీష్ కుమార్, ఆశిష్​ కుమార్​ సెమీస్​లోకి ప్రవేశించారు.

Boxam International Boxing: Satish, Ashish enter semis
బక్సమ్​ టోర్నీ: సెమీస్​లోకి సతీష్​, ఆశిష్​

స్పెయిన్​ వేదికగా జరుగుతోన్న 35వ బక్సమ్​ అంతర్జాతీయ బాక్సింగ్​ టోర్నీలో భారత బాక్సర్లు మరో అడుగు ముందుకేశారు. అద్భుత విజయాలతో సతీష్​ కుమార్, ఆశిష్​ కుమార్ సెమీస్​లోకి దూసుకెళ్లారు. 81 కేజీల విభాగంలో సుమిత్​ సంగ్వాన్​.. బెల్జియం బాక్సర్​ మోహోర్ ఎల్ జియాద్​పై 4-1 తేడాతో గెలిచి చివరి నాల్గో రౌండ్​కు అర్హత సాధించాడు.

దేశం తరఫున అత్యధిక బరువుల విభాగంలో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన సతీష్​ కుమార్(91+ కేజీలు).. డెన్మార్క్ బాక్సర్​ నీల్సెన్​పై 5-0తో విజయం సాధించాడు. ఆసియన్​ సిల్వర్​ పతక విజేత ఆశిష్​ కుమార్(75 కేజీలు)​.. ఇటలీ ప్లేయర్​ రెమో సాల్వట్టిపై 4-1తో గెలుపొంది పతకం ఖరారు చేసుకున్నాడు.

దీంతో మొత్తం 10 మంది భారత ఆటగాళ్లు(ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు) సెమీస్​లోకి ప్రవేశించినట్లయింది. అంతకు ముందు జరిగిన పోటీల్లో భారత బాక్సర్లు​ మహమ్మద్​ హుసాముద్దీన్​(57 కేజీలు), మనీష్​ కౌషిక్​(63 కేజీలు), వికాస్​ క్రిష్ణన్​(69 కేజీలు) సెమీస్​లోకి ప్రవేశించి పతకం ఖరారు చేసుకున్నారు. ఆరు సార్లు ప్రపంచ విజేత మేరీ కోమ్(51 కేజీలు), ఆసియన్ ఛాంపియన్ పూజా రాణి(75 కేజీలు), సిమ్రాన్​జిత్​ కౌర్​(60 కేజీ), జాస్మిన్​(57 కేజీలు) ఇప్పటికే సెమీస్​కు అర్హత పొందారు. ​

ఇదీ చదవండి:బక్సమ్‌ టోర్నీ: మేరీకోమ్ మరింత ముందుకు

ABOUT THE AUTHOR

...view details