తెలంగాణ

telangana

ETV Bharat / sports

భువనేశ్వర్​కు ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్​' అవార్డు

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ అవార్డును భువనేశ్వర్​ గెలుచుకున్నాడు. మార్చి నెలలో ఇంగ్లాండ్​తో పరిమిత ఓవర్ల క్రికెట్​లో అద్భుతంగా రాణించినందుకుగాను అతనికి అవార్డును ప్రకటించింది ఐసీసీ.

By

Published : Apr 13, 2021, 2:31 PM IST

Updated : Apr 13, 2021, 2:49 PM IST

Bhuvneshwar wins ICC Players of the Month award for superb show in white-ball series against England
భువనేశ్వర్​కు ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్​' అవార్డు

ప్రఖ్యాత అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్లేయర్ ఆఫ్ ది మంత్​- మార్చి అవార్డు భువనేశ్వర్​కు దక్కింది. ఇటీవల జరిగిన టీమ్​ఇండియా-ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్​ల్లో భువీ ఆరు వికెట్లు(మూడు వన్డేల్లో), నాలుగు వికెట్లు(ఐదు టీ20ల్లో) అదరగొట్టి, ఈ పురస్కారానికి నామినేటయ్యాడు.

ఇతనితో పాటు రషీద్​ ఖాన్​(అఫ్గానిస్థాన్​), సీన్​ విలియమ్స్​(జింబాబ్వే) కూడా నామినేషన్​ దక్కించుకున్నారు. కానీ.. పునరాగమనం తర్వాత తక్కువ ఎకానమీతో పరుగులిచ్చి వికెట్లు తీసిన భువీనే అవార్డు వరించింది.

లీనే..

మహిళల్లో సౌతాఫ్రికా బ్యాటర్​ లిజెల్లీ లీ.. మార్చి నెలకు గానూ ఐసీసీ ఉమెన్స్​ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​గా నిలిచింది.

Last Updated : Apr 13, 2021, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details