అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. మార్చి నెల 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుల కోసం నామినేషన్లను గురువారం ప్రకటించింది. పురుషుల విభాగంలో భువనేశ్వర్ కుమార్(భారత్), రషీద్ ఖాన్(అఫ్ఘానిస్థాన్), సీన్ విలియమ్సన్(జింబాబ్వే).. మహిళల్లో రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ రౌత్(భారత్), లీజెల్లీ లీ(దక్షిణాఫ్రికా) ఉన్నారు.
ఇటీవల జరిగిన టీమ్ఇండియా-ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ల్లో భువీ ఆరు వికెట్లు(మూడు వన్డేల్లో), నాలుగు వికెట్లు(ఐదు టీ20ల్లో) అదరగొట్టి, ఈ పురస్కారానికి నామినేటయ్యాడు. ఈ మధ్యే జరిగిన అఫ్ఘానిస్థాన్-జింబాబ్వే సిరీస్ల్లో రాణించిన రషీద్ ఖాన్, విలియమ్సన్.. జాబితాలో చోటు దక్కించుకున్నారు.