తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిరీస్​ ఎంపిక ముందు... ధోనీని గుర్తుచేసుకున్న కోహ్లీ - టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ.. తాజాగా షేర్​ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది. ఇందులో ధోనీతో వర్షంలో ఆడుతున్న సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నాడు విరాట్.

చారిత్రక టెస్టు ముందు... ధోనీని గుర్తుచేసుకున్న కోహ్లీ

By

Published : Nov 20, 2019, 7:15 PM IST

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం తన ట్విట్టర్‌‌‌లో ఓ ఫొటో షేర్ చేశాడు. ఈ చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. విరాట్​తో పాటు పలువురు టీమిండియా ఆటగాళ్లు వర్షంలో తడుస్తుండగా.. కోహ్లీకి ఎదురుగా ధోనీ కనిపించాడు.

"క్రైమ్‌లో భాగస్వాములం. బౌండరీల వద్ద ఫీల్డర్స్ నుంచి డబుల్స్ దొంగిలిస్తాం. ఎవరో చెప్పండి" అని కింగ్​ కోహ్లీ కామెంట్ పెట్టాడు.

వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు గురువారం జట్టును ప్రకటించనున్నారు సెలెక్టర్లు. ఈ మేరకు చీఫ్ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ.. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. అయితే విండీస్​తో సిరీస్‌కు ధోనీ అందుబాటులో ఉంటాడా..లేదా..! అన్న విషయంపై ఈ భేటీ తర్వాత స్పష్టత వస్తుంది. తాజాగా కోహ్లీ ట్వీట్​ చూసిన నెటిజన్లు.. మహీ వస్తున్నాడని ట్విట్టర్లో కామెంట్లు పెడుతున్నారు.

సర్వం సిద్ధం...

ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం(నవంబర్​ 22న) బంగ్లాతో డేనైట్ టెస్టు ఆడనుంది కోహ్లీ సేన. ఇప్పటికే స్టేడియం పరిసరాలను అందంగా అలంకరించిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. నవంబర్ 22 నుంచి 26 వరకు ఈ గులాబి బంతి టెస్టు జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details