తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇకపై రంజీ మ్యాచ్​ల్లోనూ 'డీఆర్​ఎస్' - రంజీలు

రానున్న రంజీ సీజన్ నాకౌట్​ మ్యాచ్​ల్లో డీఆర్​ఎస్​ను ప్రవేశపెట్టనుంది బీసీసీఐ. అనవసర తప్పిదాలు నివారించేందుకు ఈ పద్దతి తీసుకొస్తున్నామని జనరల్ మేనేజర్​ సబా కరీమ్ తెలిపారు.

ఇకపై రంజీ మ్యాచ్​ల్లోనూ 'డీఆర్​ఎస్'

By

Published : Jul 19, 2019, 9:03 PM IST

రానున్న రంజీ సీజన్​ నాకౌట్​ మ్యాచ్​ల్లో డీఆర్​ఎస్(అంపైర్ నిర్ణయ సమీక్ష)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ). గత సీజన్లలో అంపైర్ల తప్పిదాలు, మరోసారి జరగకుండా నివారించొచ్చని పేర్కొంది.

గత రంజీ సీజన్​లో అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు చాలానే జరిగాయి. సెమీస్​లో కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచే దీనికి ఉదాహరణ. వీటన్నింటిని నివారించేందుకే రంజీల్లో డీఆర్​ఎస్ పద్దతి ప్రవేశపెట్టనున్నామని బీసీసీఐ జనరల్ మేనేజర్​ సబా కరీమ్ చెప్పారు.

రంజీ ట్రోఫీ

"అందుబాటులో ఉన్న టెక్నాలజీతో తప్పిదాలను నివారించాలని చూస్తున్నాం. రంజీ ట్రోఫీ నాకౌట్​ మ్యాచ్​ల్లో డీఆర్​ఎస్​ను ప్రవేశపెట్టనున్నాం. ఫీల్డ్​ అంపైర్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది." -సబా కరీమ్, బీసీసీఐ జనరల్ మేనేజర్

గత రంజీ సెమీఫైనల్​ కర్ణాటకతో మ్యాచ్​లో అంపైర్ల తప్పిదాల వల్ల సౌరాష్ట్ర బ్యాట్స్​మెన్ ఛెతేశ్వర్ పుజారాకు జీవనదానం లభించింది. ఆ తర్వాత సెంచరీ చేశాడు. ఓటమి పాలైన ప్రత్యర్థి కర్ణాటక తుదిపోరుకు అర్హత సాధించలేకపోయింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

రంజీల్లో డీఆర్ఎస్​ ప్రవేశపెట్టాలని నిర్ణయించి.. ఈ ఏడాది మేలో కెప్టెన్లు, కోచ్​లతో కలిపి బీసీసీఐ ఓ సమావేశం ఏర్పాటు చేసింది. జూన్​లో ఈ నిర్ణయాన్ని పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆమోదించింది.

ఇది చదవండి: స్లో ఓవర్​ రేట్​కు నిషేధం ఉండదు: ఐసీసీ

ABOUT THE AUTHOR

...view details