తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ సలహా మండలి సభ్యుడిగా గంభీర్​ - cricket news

భారత మాజీ క్రికెటర్ గౌతమ్​ గంభీర్​కు బీసీసీఐ క్రికెట్ సలహా మండలిలో చోటు సంపాదించాడు. రానున్న నాలుగేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్​కు అద్భుత అవకాశం
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

By

Published : Jan 13, 2020, 6:01 AM IST

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. మంచి అవకాశం దక్కించుకున్నాడు. బీసీసీఐ క్రికెట్ సలహా మండలి (సీఏసీ)లో ఓ సభ్యుడిగా ఎంపికయ్యాడు. వచ్చే నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. గౌతీతో పాటు 1983 ప్రపంచకప్​ గెలిచిన జట్టులో సభ్యుడైన మదన్​లాల్​కు మరో సభ్యుడిగా చోటు దక్కింది. ముగ్గురితో కూడిన ఈ కమిటీకి మదన్ నాయకత్వం వహించే అవకాశముంది.

సీఏసీలో సభ్యులుగా గంభీర్, మదన్​తోపాటు మాజీ మహిళా క్రికెటర్ సులక్షణ సింగ్ ఎంపికవునుందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. వీరు త్వరలో కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్​ ఖోడా పదవీకాలం ఇప్పటికే ముగిసింది. వీరితోపాటే ఉన్న శరణ్​దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజపేలకు ఓ ఏడాది పదవీకాలముంది.

2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్​ గెలిచిన భారత జట్టులో సభ్యుడు గౌతమ్ గంభీర్. రెండు టోర్నీల ఫైనల్స్​లోనూ అత్యధిక స్కోరు సాధించాడు. గతేడాది ఆటకు రిటైర్మెంట్​ ప్రకటించాడు. అనంతరం దిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు.

ఇది చదవండి: గౌతమ్​ గంభీర్​కు బెదిరింపు కాల్స్

ABOUT THE AUTHOR

...view details