తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లండ్​ విమానం ఎక్కేది ఎవరు..? - MSK PRASAD

ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ప్రపంచకప్​కు వెళ్లే టీమిండియా జట్టును నేడు ప్రకటించనుంది.

ప్రపంచకప్​కు వెళ్లే భారత జట్టు నేడు ప్రకటన

By

Published : Apr 15, 2019, 12:03 AM IST

మే 30న ప్రారంభం కానుంది క్రికెట్ ప్రపంచకప్. ఆ మెగాటోర్నీకి వెళ్లే భారత జట్టును నేడు ప్రకటించనుంది బీసీసీఐ. జట్టులో ఉండే 15 మంది ఎవరోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చాలా మంది పేర్లు ఇప్పటికే పరిశీలనలో ఉండగా.. నాలుగో స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా రెండో వికెట్​ కీపర్​గా పంత్, దినేశ్ కార్తిక్​లలో ఎవరు ఉంటారో తెలియాల్సి ఉంది.

నాలుగో స్థానం కోసం రాయుడు, కేఎల్ రాహుల్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు. ఆల్​రౌండర్​ కోటాలో హర్దిక్​ పాండ్యకే చోటు దక్కే అవకాశం ఉంది.

జట్టు (అంచనా)

భారత్:

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, జస్​ప్రీత్​ బుమ్రా, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తిక్/రిషభ్ పంత్

ABOUT THE AUTHOR

...view details