తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2019, 5:56 AM IST

Updated : Oct 31, 2019, 7:34 AM IST

ETV Bharat / sports

ద్రవిడ్‌తో దాదా భేటీ- కీలక అంశాలపై చర్చ

బీసీసీఐ అధ్యక్షుడు దాదా, జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ) డైరెక్టర్​ రాహుల్​ ద్రవిడ్​ బుధవారం భేటీ అయ్యారు. ఎన్​సీఏ అభివృద్ధి ప్రణాళిక సహా పలు అంశాలపై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కూర్చొని చర్చించారు.

23 ఏళ్ల తర్వాత అత్యున్నత పదవుల్లో ద్రవిడ్‌-దాదా భేటీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్తున్నాడు. ప్రతిష్ఠాత్మక డే/నైట్ టెస్ట్​ సిరీస్​ కోసం బంగ్లా క్రికెట్​ బోర్డును ఒప్పించిన దాదా... అనుకున్న పనులన్నీ తొందరగా పూర్తిచేయాలన్న సంకల్పంతో ఉన్నాడు. దీనిలో భాగంగానే చిన్నస్వామి స్టేడియంలో ఎన్‌సీఏ డైరెక్టర్​ రాహుల్‌ ద్రవిడ్‌తో బుధవారం భేటీ అయ్యాడు గంగూలీ.

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ

23 ఏళ్ల తర్వాత...

ద్రవిడ్​, గంగూలీ ఒకేసారి టెస్టుల్లోకి అరంగేట్రం చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం భారత క్రికెట్​లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో గంగూలీ, ఎన్​సీఏ డైరెక్టర్​ పదవిలో ద్రవిడ్​ భేటీ అయ్యారు. బెంగళూరులో కొత్తగా నిర్మించాల్సిన జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ), దాని అభివృద్ధి ప్రణాళిక గురించిఈ భేటీలో చర్చించారు. అకాడమీ అభివృద్ధి, మౌలిక వసతులపై ద్రవిడ్​తో మాట్లాడాడు దాదా.

ఎన్​సీఏ చీఫ్​ రాహుల్​ ద్రవిడ్​తో, టీమిండియా కోచ్​ రవిశాస్త్రి

40 ఎకరాల్లో అధునాతన భవనం..

జాతీయ క్రికెట్‌ అకాడమీని మరింత అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్య ప్రణాళికను గంగూలీ, ద్రవిడ్‌ సమీక్షించారు. ఈ సమావేశంలో ఎన్‌సీఏలోని ఇతర అధికారులూ పాల్గొన్నారు. సమావేశం తర్వాత వీరంతా కలిసి నగరంలో కొత్తగా ఎన్‌సీఏను నిర్మించాల్సిన స్థలాన్ని పరిశీలించారు.

దేవనహల్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన అకాడమీ నిర్మాణం కోసం... కర్ణాటక ప్రభుత్వం 15 ఎకరాల భూమిని బీసీసీఐకి ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో మరో 26 ఎకరాలు కేటాయించడం వల్ల ప్రస్తుతం 40 ఎకరాల స్థలం ఉంది. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో, అధునాతన సౌకర్యాలతో ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్​ అకాడమీ)ను నిర్మించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతమున్న ప్రణాళిక ప్రకారం మూడు మైదానాలు, ఇండోర్​ నెట్స్​, పరిపాలనా భవనాలు, హాస్టళ్లు కట్టనున్నారు.

Last Updated : Oct 31, 2019, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details