తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​ క్రికెట్​ స్థాయిని పెంచే సత్తా వారిద్దరి​ సొంతం' - BCCI president Sourav Ganguly

ఫిబ్రవరిలో న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​ ఆడనుంది టీమిండియా. ఇందులో గెలిచి టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కొనసాగించాలని భారత్​ భావిస్తోంది. తాజాగా కివీస్​ పర్యటనపై టెస్టు జట్టు ఉపసారథి అజింక్య రహానే పలు విషయాలు వెల్లడించాడు.

BCCI president Sourav Ganguly and India A coach Rahul Dravid will take Indian cricket to unprecedented heights: Rahane
'భారత్ క్రికెట్​ను టాప్​లో ఉంచే సత్తా వారిద్దరి​ సొంతం'

By

Published : Jan 2, 2020, 6:31 AM IST

2019లో టెస్టుల్లో ఎదురులేని జట్టుగా దూసుకెళ్లిన కోహ్లీ సేన... టెస్టు ఛాంపియన్​షిప్​లో అగ్రస్థానంలో నిలిచింది. 2020లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్​తో మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్​ మ్యాచ్​లను అడనుంది. న్యూజిలాండ్‌లో మ్యాచ్​లు సహా భారత క్రికెట్​లో గంగూలీ, ద్రవిడ్​ పాత్రలపై మాట్లాడాడు టీమిండియా టెస్టు జట్టు ఉప సారథి అజింక్య రహానే.

చల్లని గాలులే కీలకం...

న్యూజిలాండ్​లో చల్లని గాలులకు తట్టుకోవడమే కీలకమని అజింక్య రహానె అన్నాడు. సాంకేతికంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరమేమీ ఉండదన్నాడు.

కెప్టెన్​ కోహ్లీతో వైస్​కెప్టెన్​ రహానే

"2014లో మేం న్యూజిలాండ్​లో పర్యటించాం. చల్లగాలి సమస్య ఎదుర్కొన్నాం. పరిస్థితులకు అలవాటు పడటమే కీలకం. చల్లదనంతో బంతులు రెండు వైపులా స్వింగవుతాయి. చివరి పర్యటనలో నేను వెల్లింగ్టన్‌లో ఆడాను. క్రైస్ట్‌చర్చ్‌లో ఆడలేదు. చాన్నాళ్ల తర్వాత అక్కడ ఆడబోతున్నాం. కివీస్‌ బౌలర్‌ నీల్‌ వాగ్నర్‌ ఈ మధ్య కాలంలో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతనొక్కడే కాదు ఒక బ్యాటింగ్‌ విభాగంగా మేం బౌలర్లు అందరినీ గౌరవించాలి. సొంతగడ్డపై ఆడుతుండటం వారికి ప్రయోజనకరం. అయితే మేం మా సహజమైన శైలిలో ఆడాల్సి ఉంటుంది".
-- రహానే, భారత జట్టు క్రికెటర్.​

వాళ్లే కీలకం...

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, ఎన్​సీఏ ఛైర్మన్​ రాహుల్‌ ద్రవిడ్​ కలిసి భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు రహానే.

గంగూలీ, ద్రవిడ్​

" 2014లో మాకంత అనుభవం లేదు. ఇంగ్లాండ్‌తో ఘోర పరాజయం తర్వాత మేమంతా మాట్లాడుకున్నాం. అగ్రస్థానానికి చేరుకోవాలని పట్టుదలతో కృషి చేశాం. కోహ్లీ, రవి భాయ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో కలివిడితనం పెంచారు. ఆటగాళ్లందరం ప్రేమతో ముందుకు సాగుతాం. ప్రసుత్తం దాదా, ద్రవిడ్​ వల్లే భారత జట్టు స్థాయి అత్యున్నత దశకు చేరుతోంది".
-- రహానే, భారత జట్టు సారథి.

జనవరి 24 నుంచి మార్చి 4 మధ్యలో న్యూజిలాండ్​ గడ్డపై ఆ జట్టుతో... 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది టీమిండియా.

ABOUT THE AUTHOR

...view details