తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఒక్క సమావేశానికే క్రికెట్​ సలహా కమిటీ నియామకం' - ఎమ్మెస్కే ప్రసాద్​ 2019

ఎమ్మెస్కే ప్రసాద్​ నేతృత్వంలోని టీమిండియా సెలక్షన్​ కమిటీ పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. కొత్త ఛైర్మన్​ ఎంపికయ్యేవరకు ప్రస్తుతం తాత్కాలిక పదవిలో కొనసాగుతున్నాడు ఎమ్మెస్కే. అయితే నూతన సెలక్షన్​ కమిటీ ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ.

Cricket Advisory Committee(CAC) 2019
సౌరభ్​ గంగూలీ

By

Published : Dec 20, 2019, 9:25 PM IST

టీమిండియా సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ త్వరలో ఆరంభం కానుంది. ఇందు కోసం క్రికెట్‌ సలహా సంఘం(సీఏసీ) వారం రోజుల్లోపు ఏర్పాటు చేస్తామని చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. నూతన సెలక్షన్‌ కమిటీ పదవీకాలం గతంలో నాలుగేళ్లు ఉండగా.. ఇకపై మూడేళ్ల వరకే ఉంటుందని వెల్లడించాడు. సెలక్టర్లను ఎంపిక చేసేందుకు కేవలం ఒక సమావేశమే సీఏసీకి ఇవ్వనున్నట్లు తెలిపాడు దాదా.

ఎమ్మెస్కే ప్రసాద్

" రెండు మూడు రోజుల్లో సలహా కమిటీని నియమిస్తాం. ప్రధాన కోచ్‌ ఎంపిక ఇప్పటికే పూర్తయింది కాబట్టి సెలక్టర్లను ఎంపిక చేసేందుకు సీఏసీ ఒక్కసారే సమావేశం అవుతుంది".
- సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ప్రస్తుత ప్రధాన సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, గగన్‌ ఖోడా పదవీకాలం ఇటీవలే ముగిసింది. జతిన్‌ పరాంజపె, శరణ్‌దీప్‌ సింగ్‌, దేవాంగ్‌ గాంధీకి మరో ఏడాది సమయం ఉంది. అయితే వీరిని కూడా కొనసాగించేందుకు బీసీసీఐ బృందం ఆసక్తిగా లేదు. గతంలోనూ టీమిండియా కోచ్​గా రవిశాస్త్రిని నియమించే సమయంలో.. కపిల్‌దేవ్‌ నేతృత్వంలో సలహా సంఘం తాత్కాలికంగా ఏర్పాటైంది.

ఇదీ ముఖ్యం...

సచిన్‌, కపిల్‌, లక్ష్మణ్‌, ద్రవిడ్‌ వంటి మాజీలపై పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదం రావడం వల్ల ఈ సారి సీఏసీలో ఎవరుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details