తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​ కోసం దరఖాస్తుల ఆహ్వానం - బీసీసీఐ

ఈ ఏడాది యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది.​ అయితే ఈసారి లీగ్ టైటిల్​ స్పాన్సర్​షిప్​ కోసం థర్డ్​పార్టీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. ఆగస్టు 18న వేలం నిర్వహిస్తామని తాజాగా ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

BCCI invites expression of interest for IPL 2020 title sponsors
ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​కు దరఖాస్తుల ఆహ్వానం

By

Published : Aug 11, 2020, 6:11 AM IST

ఐపీఎల్​ 13వ సీజన్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ కోసం దరఖాస్తు చేసుకోవడానికి థర్డ్​ పార్టీలనుఆహ్వానించింది భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ). వేలంలో పాల్గొనదలచిన వారు ఆగస్టు 14లోపు వారి వివరాలు పంపిస్తే.. ఆగస్టు 18న​ వేలం జరుగుతుందని వెల్లడించింది.

"ఆసక్తి ఉన్నవారు 'ఐపీఎల్​-2020 టైటిల్​ స్పాన్సర్​షిప్​' కోసం తమ వివరాలను బీసీసీఐకి మెయిల్​ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 14వ తేదీన సాయంత్రం ఐదు గంటల వరకు తుదిగడువు. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించాలా లేదా అనేది బీసీసీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్​ టైటిల్ స్పాన్సర్​షిప్​ వేలం ఆగస్టు 18 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. పైన తెలిపిన ప్రణాళికను బీసీసీఐ అభీష్ఠానుసారం మార్చడానికి వీలుంటుంది" అని బీసీసీఐ వెల్లడించింది.

"ఈ టైటిల్​ స్పాన్సర్​షిప్​ హక్కు గడువు కాలం 2020 ఆగస్టు 18 నుంచి 2020 డిసెంబరు 31 వరకు. టైటిల్​ స్పాన్సర్​షిప్​ కోసం ఆసక్తి చూపే థర్డ్​ పార్టీల ఆదాయం ఆడిట్​ ప్రకారం రూ.300 కోట్లకు మించి ఉండాలి" అని క్రికెట్​ నియంత్రణ మండలి స్పష్టం చేసింది.

వివోతో తెగదెంపులు

ఇటీవలే భారత్​-చైనా మధ్య జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీ వివోతో ఐపీఎల్​ స్పాన్సర్​షిప్​ను రద్దు చేసుకుంది బీసీసీఐ​. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గతవారమే విడుదల చేసింది. 2018 నుంచి ఐదేళ్ల పాటు (2022 వరకు) ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ను వేలంలో సొంతం చేసుకుంది వివో. దీనికోసం వివో మొత్తం రూ.2,190 కోట్లను బీసీసీఐకి చెల్లించింది.

ABOUT THE AUTHOR

...view details