తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ వార్షిక సమావేశం నిరవధిక వాయిదా - bcci agm meeting news

ఈ ఏడాది సెప్టెంబర్​లో జరగాల్సిన బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్​) నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు బీసీసీఐ సెక్రటరీ జైషా. ఈ మేరకు అన్ని రాష్ట్ర సంఘాలకు లేఖలు పంపినట్లు తెలుస్తోంది.

bcci-indefinitely-postpones-its-agm-due-to-covid-19-pandemic
బీసీసీఐ వార్షిక సమావేశం నిరవధిక వాయిదా

By

Published : Sep 12, 2020, 2:19 PM IST

కరోనా నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా సెప్టెంబర్​ 30న నిర్వహించే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్​)... ఈ ఏడాది నిరవధికంగా వాయిదా వేసింది. ఈ అంశంపై అన్ని రాష్ట్ర సంఘాలకు సమాచారం ఇచ్చారు బీసీసీఐ సెక్రటరీ జైషా. తమిళనాడు సొసైటీస్​ రిజిస్ట్రేషన్​ యాక్ట్​-1975 ప్రకారం బోర్డు రిజిస్ట్రేషన్​ కావడం వల్ల ప్రతి ఏటా ఏజీఎమ్​ నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ చట్టం ప్రకారం ఆన్​లైన్​ ద్వారా బోర్డు వార్షిక సమావేశం నిర్వహించేందుకు వీలు లేదని జైషా పేర్కొన్నారు. వాయిదా పడిన ఈ సమావేశం ఈ ఏడాది డిసెంబర్​లోగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం మాత్రం వర్చువల్​గా జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details