తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒకేరోజు టెస్టు, వన్డే ఆడనున్న టీమిండియా!

బీసీసీఐకి ఏర్పడిన ఆర్థికలోటును భర్తీ చేసేందుకు ఒకే రోజు రెండు ఫార్మాట్లలో మ్యాచ్​ ఆడనుంది టీమిండియా. ఈ విషయమై మాట్లాడిన బోర్డు అధికారి ఒకరు.. తమకున్న ఒకే ఒక ఆప్షన్ ఇదేనని చెప్పారు.

By

Published : May 9, 2020, 12:09 PM IST

ఒకేరోజు టెస్టు, వన్డే ఆడనున్న టీమిండియా!
టీమిండియా జట్టు

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఓ రోజులో ఉదయం పూట టెస్టు, మధ్యాహ్నం వన్డే ఆడే పరిస్థితులు టీమిండియాకు రానున్నాయని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఈ వైరస్ వల్ల మ్యాచ్​లు వాయిదా పడిన నేపథ్యంలో, బోర్డుకు ఏర్పడిన ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఈ మ్యాచ్​ల కోసం రెండు వేర్వేరు జట్ల ఉండనున్నాయని తెలిపారు.

టీమిండియా టెస్టు జట్టు

"అంతర్జాతీయ మ్యాచ్​లు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో మాకు కచ్చితంగా తెలియదు. అలాంటి ఈ సమయంలో స్పాన్సర్స్​కు భరోసా కల్పించాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్.. టీమిండియాకు సంబంధించి రెండు జట్లను తయారు చేసి.. వారితో టెస్టు, టీ20 సిరీస్​లను ఏకకాలంలో జరపాలి" -బీసీసీఐ అధికారి

గతంలో ఇదే తరహాలో 2017 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా రెండు జట్లతో ఆడింది. శ్రీలంకతో స్వదేశంలో ఓ జట్టు టీ20 సిరీస్ ఆడగా​, భారత్​లో టీమిండియాతో బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్​లో మరో జట్టు తలపడింది.

ప్రాణాంతక కరోనా వల్ల మార్చి నుంచి క్రికెట్​కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు మనదగ్గర నిలిచిపోయాయి. లాక్​డౌన్ వల్ల అదే నెల చివరి నుంచి జరగాల్సిన ఐపీఎల్.. నిరవధిక వాయిదా పడింది. ఒకవేళ టోర్నీ.. ఈ ఏడాదిలో జరగకపోతే బోర్డుకు దాదాపు రూ.4000 కోట్లు ఉంటుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఇటీవలే చెప్పారు. దీనితో పాటే వైరస్​ ప్రభావంతో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన, టీ20 ప్రపంచకప్​ నిర్వహణపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details