తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2020, 11:44 AM IST

ETV Bharat / sports

ఒలింపిక్స్​లో క్రికెట్ ప్రధాన అజెండాగా బీసీసీఐ సమావేశం

ఈ నెల 24న బీసీసీఐ 89వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్​)ను జరగనుంది. ఈ విషయాన్ని బోర్డు తెలిపింది. ఐపీఎల్​లో అదనంగా మరో రెండు జట్లను చేర్చడం, ఒలింపిక్స్​లో క్రికెట్​ ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగబోతుంది.

bcci
బీసీసీఐ

కరోనా వల్ల నిరవధిక వాయిదా పడిన 89వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని(ఏజీఎమ్​) ఈ నెల 24న నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర సంఘాలకు సమాచారమిచ్చింది. ఈ భేటికి సంబంధించిన వేదిక వివరాలను త్వరలో తెలియజేయనుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో 23 అంశాల గురించి చర్చించుకోనున్నారు. అందులో ముఖ్యమైనవి..

  • ఐపీఎల్​లో ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లకు అదనంగా మరో రెండు జట్లను చేర్చడం
  • ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చే అవకాశంపై చర్చ
  • ఐపీఎల్​ పాలకమండలిలో ప్రతినిధులను ఎన్నుకోవడం
  • 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్​ నిర్వహణ​
  • టీమ్​ఇండియా భవిష్యత్తు పర్యటనలు

వీటితో సహ బోర్డుకు సంబంధించిన పలు విషయాలపై సమగ్ర చర్చ జరపనున్నారు.

ఇదీ చూడండి : 'టీమ్​ఇండియాకు వారిద్దరు కీలకంగా మారతారు'

ABOUT THE AUTHOR

...view details