తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లా బౌలర్‌పై 5 ఏళ్ల నిషేధం... భారీ జరిమానా! - బంగ్లాదేశ్​ బౌలర్​ షహదత్‌ హొసేన్‌

సహా ఆటగాడిపై దాడికి పాల్పడినందుకు బంగ్లాదేశ్​ బౌలర్​ షహదత్‌ హొస్సేన్‌పై అయిదేళ్ల నిషేధం విధించింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. అంతేకాకుండా రూ. 2 లక్షల 53 వేలు (3 లక్షల టాకాలు) జరిమానా వేసింది.

బంగ్లాదేశ్​ బౌలర్​ షహదత్‌ హొస్సేన్‌

By

Published : Nov 19, 2019, 9:43 PM IST

Updated : Nov 20, 2019, 11:42 AM IST

మైదానంలో తోటి ఆటగాడిపై దాడికి పాల్పడిన బంగ్లాదేశ్ సీనియర్ బౌలర్ షహదత్ హొస్సేన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఫలితంగా అతడు జాతీయ క్రికెట్‌ లీగ్‌లో ఆడలేడు. అంతేకాకుండా రూ. 2 లక్షల 53 వేలు (3 లక్షల టాకాలు) జరిమానా వేస్తూ నిర్ణయం తీసుకుంది బోర్డు.

బంగ్లాదేశ్‌ లీగ్‌లో భాగంగా ఢాకా, ఖుల్నా డివిజన్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగా అరఫత్‌ సన్నీ.. షహదత్‌ బౌలింగ్‌ సామర్థ్యాన్ని ప్రశ్నించాడు. సహనం కోల్పోయిన మాజీ పేసర్‌.. అతనిపై దాడి చేశాడు.

" షహదత్‌ తన నేరాన్ని అంగీకరించి ఇంటికి వెళ్లాడు. మ్యాచ్‌ రిఫరీ నివేదికను నిపుణుల కమిటీ పరిశీలించి జాతీయ క్రికెట్‌ లీగ్‌ నుంచి అతడిని నిషేధించింది. ఇప్పట్నుంచి అయిదేళ్లు సస్పెన్షన్‌ ఎదుర్కొంటాడు. అలాగే బంగ్లా క్రికెట్‌ బోర్డు పరిధిలో ఏ టోర్నీలోనూ పాల్గొనలేడు. 3 లక్షల టాకాల జరిమానా విధించాం".
--బంగ్లా క్రికెట్‌ బోర్డు అధికారి

షహదత్‌ 2005 నుంచి 2015 వరకు బంగ్లా తరఫున 38 టెస్టులు, 51 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. మొత్తం 153 వికెట్లు తీశాడు. 33 ఏళ్ల హొస్సేన్‌ పేలవ ఫామ్ కారణంగా 2015 నుంచి జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటి నుంచి దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.

Last Updated : Nov 20, 2019, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details