తెలంగాణ

telangana

ETV Bharat / sports

'షకిబ్ చేసింది తప్పే.. అయినా మద్దతుగా నిలవండి' - షకిబ్​కు బంగ్లా ప్రధాని మద్దతు

బంగ్లాదేశ్ ఆల్​రౌండర్ షకిబుల్  హసన్​కు బీసీబీ మద్దతుగా నిలవాలని కోరారు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా. అతడు చేసింది ముమ్మాటికి తప్పేనని అన్నారు.

'షకిబ్ చేసింది తప్పే.. కానీ మద్దతుగా నిలవండి'

By

Published : Oct 30, 2019, 2:12 PM IST

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకిబుల్ హసన్​పైరెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించింది. ఈ విషయంపై​ సానుభూతి వ్యక్తం చేశారు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా. షకిబ్ తప్పు చేశాడని, అయినా బంగ్లాదేశ్​ క్రికెట్ బోర్డు అతడికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

"షకిబ్ తప్పు చేశాడని స్పష్టంగా తెలుస్తోంది. ఆ విషయం మేం అర్థం చేసుకోగలం. ఐసీసీ నిర్ణయంపై ప్రభుత్వం ఏం చేయలేదు. కానీ బీసీబీ అతడికి(షకిబ్​) మద్దతుగా నిలవాలి" - షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని.

అయితే షకిబ్ వ్యవహారం గురించి బీసీబీకి ఏం తెలియదని చెప్పాడు బంగ్లా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్.

"నేను ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. షకిబుల్​తో ఐసీసీ విచారణ, అతడితో బుకీ సంభాషణ గురించి బీసీబీకి ఏమాత్రం తెలియదు. ఏసీయూ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. షకిబ్​ను స్వయంగా ఏసీయూనే విచారించింది. ఘటనకు రెండు రోజులు ముందే అతడు ఈ వ్యవహారం గురించి వెల్లడించాడు" - నజ్ముల్ హసన్, బీసీబీ అధ్యక్షుడు

జట్టు వ్యుహాలు, అంతర్గత సమాచారం ఇవ్వాలని భారత బుకీ దీపక్ అగర్వాల్.. షకిబుల్ హసన్​ను సంప్రందించేదుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి చేరవేయని కారణంగా అతడిపై రెండేళ్లు నిషేధం విధించింది ఐసీసీ.

ఇదీ చదవండి: 'బ్రో సమాచారం ఇస్తావా'.. షకిబ్-బుకీ సంభాషణ బహిర్గతం

ABOUT THE AUTHOR

...view details