తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2019, 11:51 AM IST

Updated : Nov 14, 2019, 11:58 AM IST

ETV Bharat / sports

లంచ్ విరామానికి.. బంగ్లా టాపార్డర్​ పెవిలియన్​కు

ఇండోర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న టెస్టులో భారత బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. తొలిరోజు లంచ్ విరామానికి 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్​ను దెబ్బతీశారు. ప్రత్యర్థి జట్టు 63 పరుగులు చేసింది.

టీమిండియా

బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్​ మరోసారి విజృంభిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా పులులను ఆరంభంలోనే దెబ్బతీసింది. తొలి సెషన్​ ముగిసే సమయానికి ప్రత్యర్థి జట్టులోని టాపార్డర్ బ్యాట్స్​మెన్​ను పెవిలియన్​కు పంపారు టీమిండియా బౌలర్లు. ఇషాంత్, ఉమేశ్, షమి తలో వికెట్ తీశారు.

12 పరుగులకే ఓపెనర్ ఇమ్రుల్ కేయుస్(6) వికెట్​ తీసి దెబ్బతీశాడు ఇషాంత్ శర్మ. కాసేపటికే మరో ఓపెనర్ ఇస్లామ్​ను(6) ఔట్ చేసి బంగ్లాను కష్టాల్లో పడేశాడు ఉమేశ్ యాదవ్. అనంతరం క్రీజులో నిలదొక్కుకుంటున్న మిథున్​ను(13) ఎల్బీడబ్ల్యూ చేశాడు షమి.

ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ మోమినుల్ హక్(22), ముష్ఫికర్ రహీమ్(14) ఉన్నారు. నిలకడగా ఆడుతూ బంగ్లా ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లంచ్ విరామానికి బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.

ఇదీ చదవండి: టైమ్​ మ్యాగజైన్ '100 నెక్స్ట్​' జాబితాలో ద్యుతికి చోటు

Last Updated : Nov 14, 2019, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details