తెలంగాణ

telangana

By

Published : Apr 29, 2020, 5:58 PM IST

ETV Bharat / sports

కరోనా కట్టడి కోసం ట్రిపుల్ సెంచరీ బ్యాట్ వేలం​

కరోనాను అడ్డుకునేందుకు తనకెంతో ఇష్టమైన బ్యాట్, జెర్సీని వేలానికి ఉంచాడు పాక్ క్రికెటర్ అజహర్ అలీ. తద్వారా వచ్చిన డబ్బును వైరస్​ కట్టడికి వినియోగిస్తానని అన్నాడు.

కరోనా కట్టడి కోసం ట్రిపుల్ సెంచరీ బ్యాట్ వేలం​
పాకిస్థాన్ క్రికెటర్ అజహర్ అలీ

ప్రాణాంతక కరోనాను అరికట్టటంలో భాగంగా సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు తమ వంతు సాయమందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన వంతు విరాళం అందించేందుకు ముందుకొచ్చాడు పాకిస్థాన్ క్రికెటర్ అజహర్ అలీ. వెస్టిండీస్​పై త్రిశతకం చేసిన బ్యాట్, ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచినప్పటి జెర్సీని ఈ వేలంలో ఉంచాడు. వాటి కనీస ధర రూ.10 లక్షలుగా నిర్ణయించాడు. అందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశాడు.

"నాకు ఎంతో ఇష్టమైన రెండు వస్తువులు వేలానికి పెడుతున్నా. ఇందులో ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్​తో పాటు ఛాంపియన్స్​ ట్రోఫీలోని జట్టు సభ్యుల సంతకాలతో కూడిన జెర్సీ ఉంది. ఈ రెండింటి ప్రాథమిక ధరను రూ.1 మిలియన్ పాకిస్థానీ రూపాయలుగా నిర్ణయించా. మే 5 వరకు వేలం కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చిన డబ్బును కొవిడ్-19 కట్టడికి వినియోగిస్తా" -అజహర్ అలీ, పాక్ క్రికెటర్

2016లో యూఏఈ వేదికగా వెస్టిండీస్​తో జరిగిన డే అండ్ నైట్​ టెస్టులో త్రిశతకం చేశాడు అజహర్ అలీ. తద్వారా ఈ ఫార్మాట్​లో తొలి త్రిశతకం చేసిన బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు.

ABOUT THE AUTHOR

...view details