తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2020, 11:46 AM IST

ETV Bharat / sports

కొత్త జెర్సీల్లో భారత క్రికెటర్లు.. ఆ సిరీస్​ కోసమే!

ఆసీస్ పర్యటనలో టీమ్​ఇండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలతో కనువిందు చేయనున్నారు. త్వరలో ఈ విషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. నవంబరు 27న తొలి వన్డే జరగనుంది.

కొత్త జెర్సీల్లో భారత క్రికెటర్లు.. ఆ సిరీస్​ కోసమే!
Team India to don retro style kit for limited-overs series

త్వరలో ఆస్ట్రేలియాతో జరగూబోయే పరిమిత ఓవర్ల సిరీస్​లో టీమ్​ఇండియా క్రికెటర్లు కొత్త లుక్​తో దర్శనమివ్వనున్నారని సమాచారం. 1992 ప్రపంచకప్​లో భారత ఆటగాళ్లు వేసుకున్న జెర్సీను స్పూర్తిగా తీసుకుని వీటిని తయారు చేయనున్నారట. ఇప్పటికే కొత్త జెర్సీలను వేసుకునే ఆసీస్​ ఆటగాళ్లు బరిలో దిగనున్నారు.

టీమ్​ఇండియా ధరించబోయే కొత్త జెర్సీ

రెండు నెలల పర్యటన కోసం ఆస్ట్రేలియాకు బుధవారమే పయనమైంది టీమ్​ఇండియా. సిడ్నీలో దిగిన తర్వాత 14 రోజులు క్వారంటైన్​లో ఉంటారు. ఆ తర్వాత నవంబరు 27న తొలి వన్డే ఆడతారు. పర్యటనలో భాగంగా ఇరుజట్లు.. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి.

ఆసీస్​కు పయనమైన భారత క్రికెటర్లు
కొత్త జెర్సీతో ఆసీస్ క్రికెటర్ స్టార్క్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details