తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2020, 5:15 PM IST

Updated : Dec 6, 2020, 5:33 PM IST

ETV Bharat / sports

రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ కైవసం

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

AUS vs IND: IND won by 6 wickets in second T20
రెండో టీ20లో భారత్ విజయం..సిరీస్ కైవసం

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమ్ఇండియా. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 194 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్‌ (58; 32 బంతుల్లో, 10×4, 1×6) ఆకట్టుకున్నాడు‌.

అనంతరం బరిలోకి దిగిన భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. శిఖర్‌ ధావన్‌ (52; 36 బంతుల్లో, 4×4, 2×6), హార్దిక్ పాండ్య (42*; 22 బంతుల్లో, 3×4 ,2×6), విరాట్ కోహ్లీ (40; 24 బంతుల్లో, 2×4, 2×6), కేఎల్‌ రాహుల్‌ (30; 22 బంతుల్లో, 2×4, 1×6) రాణించారు.

Last Updated : Dec 6, 2020, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details