మైదానంలో బరిలో దిగిన క్రికెటర్లు స్లెడ్జింగ్కు పాల్పడే సందర్భాలు సాధారణంగానే జరుగుతుంటాయి. ముఖ్యంగా 2017లో బెంగళూరు వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా బౌలర్ ఇషాంత్ శర్మ.. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్పై చేసిన స్లెడ్జింగ్ అభిమానుల మదిలో గుర్తుండిపోతుంది. ఎందుకంటే ముఖ కవళికల ద్వారా ఇషాంత్ చేసిన స్లెడ్జింగ్ ఎంతో హాస్యస్పదంగా ఉంటుంది. దీనిపై అనేకమంది మీమ్స్ కూడా తయారు చేశారు.
అయితే ఈ ఏడాది జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్లో స్మిత్పై స్లెడ్జింగ్ చేయడం సాధ్యం కాకపోవచ్చని తెలిపాడు ఇషాంత్. ప్రస్తుతం తాను ఆటను ఎంతగానో ఆస్వాదించే దశలో ఉన్నట్లు పేర్కొన్నాడు. జట్టును గెలిపించడమే ముఖ్య లక్ష్యమని అన్నాడు. బీసీసీఐ టీవీ నిర్వహించిన ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ కార్యక్రమంలో ఇషాంత్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
"ప్రస్తుతం నేను క్రికెట్ను ఎంతగానో ఆస్వాదించే దశలో ఉన్నా. మ్యాచులో ఎక్కువ వికెట్లు తీసి, జట్టును గెలిపించే దిశగా కృషి చేయడం నా లక్ష్యం. "