తెలంగాణ

telangana

By

Published : Apr 14, 2020, 4:53 PM IST

ETV Bharat / sports

'క్రికెటర్ల ఎనర్జీకి అదే కారణం అనుకునేవాడ్ని'

ఐసీసీ ట్విట్టర్​లో అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు భారత సీనియర్ బౌలర్ అశ్విన్. తన చిన్నతనంలో క్రికెటర్ల పట్ల ఉన్న ఆలోచన గురించి ట్వీట్ చేశాడు.

Ashwin reveals the misconception he had about cricket while growing up
అశ్విన్​

ఎనర్జీ డ్రింక్స్​ తాగడం వల్లే క్రికెటర్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారని తాను చిన్నతనంలో అనుకునేవాడినని చెప్పాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. అంతకుముందు ఈ విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలి ట్విట్టర్​లో ప్రశ్నించగా, బదులుగా ఇలా సమాధానమిచ్చాడు అశ్విన్. ఇది ఇప్పుడు వైరల్​గా మారింది.

మీ చిన్నతనంలో క్రికెట్​ పట్ల ఎలాంటి అపోహలు ఉండేవి? అని ఐసీసీ ట్వీట్ చేసింది. దీనికి అశ్విన్​తో పాటు పలువురు క్రికెటర్లు సమాధానాలు ఇచ్చారు.

చివరగా అశ్విన్​... ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్​-న్యూజిలాండ్​ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్​లో పాల్గొన్నాడు. ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరోనా ప్రభావంతో ఈ టోర్నీ వాయిదా పడింది. అయితే ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయం ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది.

ఇదీ చూడండి : యువరాజ్​ ఫౌండేషన్‌కు అఫ్రిది భారీ విరాళం

ABOUT THE AUTHOR

...view details