తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ మ్యాచ్ అంటే కోహ్లీకి చాలా ఇష్టం

2016 టీ20 ప్రపంచకప్​లో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్స్ ఫైనల్​ తన ఫేవరెట్ మ్యాచ్​ అని చెప్పాడు విరాట్ కోహ్లీ. ఇందులో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

By

Published : May 9, 2020, 4:26 PM IST

ఆ మ్యాచ్ అంటే కోహ్లీకి చాలా ఇష్టం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

తన ఫేవరెట్ క్రికెట్​ మ్యాచ్​ గురించి వెల్లడించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 2011 ప్రపంచకప్ ఫైనల్​ మినహాయిస్తే, 2016 టీ20 ప్రపంచకప్​లో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్​ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఇటీవలే ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు.

2016 టీ20 ప్రపంచకప్ మ్యాచ్​లోని దృశ్యం

ఈ మ్యాచ్​లో అత్యధికంగా 82 పరుగులు చేసిన కోహ్లీ.. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. తొలుత ఆసీస్ 160/6 పరుగులు చేయగా, అనంతరం టీమిండియా.. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి, 6 వికెట్ల తేడాతో గెలిచింది.

82 పరుగులతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ

ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న కోహ్లీ.. భవిష్యత్తులో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్​లు నిర్వహిస్తే ఆటగాళ్లలో జోష్ మిస్సవుతుందని అన్నాడు. అభిమానులు లేకపోతే ఆటలో ఉండే మ్యాజిక్​ సృష్టించడం కష్టమని అభిప్రాయపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details