తన ఫేవరెట్ క్రికెట్ మ్యాచ్ గురించి వెల్లడించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 2011 ప్రపంచకప్ ఫైనల్ మినహాయిస్తే, 2016 టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఇటీవలే ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు.
ఆ మ్యాచ్ అంటే కోహ్లీకి చాలా ఇష్టం
2016 టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్స్ ఫైనల్ తన ఫేవరెట్ మ్యాచ్ అని చెప్పాడు విరాట్ కోహ్లీ. ఇందులో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
ఈ మ్యాచ్లో అత్యధికంగా 82 పరుగులు చేసిన కోహ్లీ.. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. తొలుత ఆసీస్ 160/6 పరుగులు చేయగా, అనంతరం టీమిండియా.. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి, 6 వికెట్ల తేడాతో గెలిచింది.
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న కోహ్లీ.. భవిష్యత్తులో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లు నిర్వహిస్తే ఆటగాళ్లలో జోష్ మిస్సవుతుందని అన్నాడు. అభిమానులు లేకపోతే ఆటలో ఉండే మ్యాజిక్ సృష్టించడం కష్టమని అభిప్రాయపడ్డాడు.