తెలంగాణ

telangana

ETV Bharat / sports

అనుష్క ఒడిలో కోహ్లీ.. ఫొటోలు వైరల్

బంగ్లాదేశ్​తో టెస్టు సిరీస్​ ముగిసిన అనంతరం ఆటగాళ్లు ముంబయి బయల్దేరారు. ఎయిర్​పోర్ట్​లో కోహ్లీకి ఘనస్వాగతం పలికింది అనుష్క శర్మ. అతడిని గట్టిగా కౌగిలించుకుని ప్రేమను వ్యక్తం చేసింది. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

By

Published : Nov 25, 2019, 12:15 PM IST

కోహ్లీ

బంగ్లాదేశ్​తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 2-0 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది. మూడు రోజుల్లోనే గులాబి టెస్టు ముగిసింది. మ్యాచ్​ అనంతరం ఆటగాళ్లు సోమవారం ముంబయికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్​పోర్ట్​లో దిగిన కోహ్లీకి భార్య అనుష్క శర్మ ఘన స్వాగతం పలికింది.

భర్త కోహ్లీని చూసి అనుష్క సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఇరువురు కారులోఇంటికి బయల్దేరగా, కోహ్లీ ఒడిలో అనుష్క వాలిపోయింది. భర్తను గట్టిగా హగ్‌ చేసుకుని తన ప్రేమను వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అనుష్క, కోహ్లీ

విరుష్క జోడీ ఎప్పుడు ఖాళీ దొరికినా వివిధ ప్రదేశాలు చుట్టేస్తూ జాలీగా గడుపుతుంది. ఇటీవల భూటాన్‌లో విహరించిన ఈ జంట.. అందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

అనుష్క, కోహ్లీ

ఇవీ చూడండి.. 'నేను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా తీసుకోవద్దు'

ABOUT THE AUTHOR

...view details