తెలంగాణ

telangana

జట్టులోకి వస్తానని ముందే ఊహించా: దూబే

By

Published : Oct 25, 2019, 12:24 PM IST

బంగ్లాదేశ్​తో జరగబోయే టీ20 సిరీస్ కోసం భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు యువ ఆల్​రౌండర్ శిమమ్ దూబే. అయితే జట్టులోకి వస్తానని ఎప్పుడో ఊహించానని అన్నాడీ క్రికెటర్.

దూబె

బంగ్లాదేశ్​తోత్వరలో జరగబోయే టీ20 సిరీస్​కు ఎంపికయ్యాడు యువ క్రికెటర్ శివమ్ దూబే. దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటి, సెలక్టర్ల దృష్టిలో పడి.. భారత జట్టులో చోటు సంపాదించాడు. అయితే ఈ అవకాశం రావడానికి కోహ్లీ సహకారం ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు.

"సహజంగానే నాకు హిట్టింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. దానిపై మరింత సాధన చేశా. బ్యాటింగ్‌ దూకుడగా చేయాలని, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని మా నాన్న కోరుకున్నారు. పవర్‌ హిట్టింగ్‌ అంటే నాకిష్టం. టీమిండియాలో చోటు సంపాదించడం ఆనందంగా ఉంది. ఎంపికవుతానని ముందే ఊహించా. ఎందుకంటే నా ప్రదర్శనపై నాకు నమ్మకం ఉంది. క్రికెట్‌లో మెరుగయ్యేందుకు మరింత సాధన చేస్తా. ఆల్‌రౌండర్‌గా 100 శాతం ఏకాగ్రత, ఫిట్‌నెస్‌ నాకు అవసరం. ముంబయి అండర్‌-23 జట్టుకు ఎంపిక కానప్పుడు మా అన్నయ్య ఆర్థికంగా ఎంతో సహాయం చేశాడు. ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ అండగా నిలిచాడు. ఒత్తిడికి లోనైనా, ఏదైనా సమస్య తలెత్తినా కోహ్లీతో పంచుకునేవాడిని. అతడు నా సమస్యను అర్థం చేసుకుని సాయం చేసేవాడు"
-శివమ్ దూబే, టీమిండియా యువ ఆటగాడు

2018లో బరోడాతో రంజీ మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు దూబే. తర్వాత ఐపీఎల్​లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుఅతడిని రూ.5 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇతడు మంచి పేసర్ కూడా. 16 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులాడిన శివమ్.. 1,012 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే వెస్టిండీస్‌-ఏ, దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన సిరీస్​ల్లో అద్భుతంగా రాణించాడు.

ఇవీ చూడండి.. రానా సరికొత్త పాత్ర.. 'హైదరాబాద్ ఎఫ్​సీ కో ఓనర్​'

ABOUT THE AUTHOR

...view details