తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ తర్వాత భారత క్రికెటర్లు అట్నుంచి అటే - ipl indian cricketers

టీ20 లీగ్​ పూర్తయిన తర్వాత అక్కడి నుంచే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు భారత క్రికెటర్లు. ప్రస్తుతం లీగ్​లో భాగం కానివారు త్వరలో దుబాయ్ చేరుకోనున్నారు.

after IPL indian cricket team players for australia tour
ఐపీఎల్ తర్వాత భారత క్రికెటర్లు అట్నుంచి అటే

By

Published : Oct 5, 2020, 7:30 AM IST

Updated : Oct 5, 2020, 8:32 AM IST

ఓవైపు ఐపీఎల్‌ జరుగుతుండగా మరోవైపు బీసీసీఐ, ఆస్ట్రేలియా పర్యటన ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. భారత జట్టు నవంబరు 12న ప్రత్యేక విమానంలో బయల్దేరనుంది. బోర్డు ప్రస్తుతం యూఏఈలో లేని ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని ఈ నెలాఖరుకు దుబాయ్‌ పిలిపించనుంది. పుజారా, హనుమ విహారి, కోచ్‌ రవిశాస్త్రి, ఐపీఎల్‌లో భాగం కాని సహాయ సిబ్బందిలోని ఇతర సభ్యుల కోసం ప్రత్యేక బయో బబుల్‌ను సృష్టించనుంది.

ఆస్ట్రేలియాలో భారత జట్టు క్వారంటైన్‌ కాలం ఎక్కువ ఉండకుండా చూడాలన్నది బీసీసీఐ ఉద్దేశం. అయితే ఆ దేశంలో భారత జట్టు స్థావరం ఎక్కడ అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

Last Updated : Oct 5, 2020, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details