తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో రెండో టెస్టులో ప్రేక్షకులకు అనుమతి!

ఎప్పుడెప్పుడు మైదానాల్లో మ్యాచ్​ చూడాలా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించే వీలుంది. ఈ మేరకు తమిళనాడు క్రికెట్ సంఘం అధికారి సంకేతాలిచ్చారు.

By

Published : Jan 31, 2021, 9:04 PM IST

After fresh Govt guidelines, 50 per cent spectators likely for 2nd India-England Test
భారత్ x ఇంగ్లాండ్​: రెండో టెస్టుకు ప్రేక్షకుల అనుమతి!

చెన్నైలో ఇంగ్లాండ్​తో జరిగే రెండో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది. క్రీడా వేదికల్లో 50శాతం ప్రేక్షకులను అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 నూతన మార్గదర్శకాలు విడుదల చేయడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), తమిళనాడు క్రికెట్ సంఘం(టీఎన్​సీఏ) పరిశీలిస్తున్నాయి.

"ప్రభుత్వ ఉత్తర్వులు శనివారమే వచ్చాయి. కాబట్టి ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించడానికి సమయం లేదు. ఇంత తక్కువ సమయంలో ఏర్పాట్లు చేయలేం. కానీ ఫిబ్రవరి 13న మొదలయ్యే రెండో టెస్టుకు ఆ అవకాశం ఉంది." అని టీఎన్​సీఏ అధికారి తెలిపారు.

చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదని టీఎన్​సీఎ ఇదివరకే ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో.. బీసీసీఐ, టీఎన్​సీఏ అధికారుల మధ్య సోమవారం నుంచి చర్చలు జరగనున్నాయి. అహ్మదాబాద్​లోని సర్దార్​ పటేల్​ మైదానంలో జరిగే మూడు, నాలుగు టెస్టులకు మాత్రం వీక్షకులకు అనుమతి ఉంది.

మీడియాకు ప్రవేశం!

ప్రెస్​ బాక్సులో మీడియాను అనుమతించే విషయంపైనా టీఎన్​సీఏ సమాలోచనలు చేస్తోంది.

ఇదీ చూడండి:'కోహ్లీని ఎలా ఔట్​ చేయాలో తెలియడం లేదు'

ABOUT THE AUTHOR

...view details