తెలంగాణ

telangana

By

Published : Aug 2, 2020, 1:09 PM IST

ETV Bharat / sports

'యూఏఈలో ప్రమాదకరం.. భారత్​లో నిర్వహించండి'

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్​ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే, భారత్​లోనే ఈ లీగ్ నిర్వహించాలని ఐపీఎల్​ మ్యాచ్​ ఫిక్సింగ్​ పిటిషనర్​ ఆదిత్యా వర్మ.. బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Aditya Verma requests Sourav Ganguly to 'conduct IPL in India'
ఐపీఎల్​

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్​​ను యూఏఈలో కాకుండా.. భారత్​లోనే నిర్వహించాలని​​ ఐపీఎల్ స్పాట్​ ఫిక్సింగ్​ కేసు పిటిషనర్​​ ఆదిత్యా వర్మ బీసీసీఐ చీఫ్​ సౌరభ్​ గంగూలీని కోరాడు. యూఏఈలోనూ కరోనా విజృంభిస్తోందని.. ఆ దేశం కూడా ఆటగాళ్లకు అంత సురక్షితం కాదని బీసీసీఐకి ఓ లేఖ రాశాడు.

సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా లీగ్​ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే కేంద్రం అనుమతి కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. అయితే, ఐపీఎల్​ను భారత్​లోనే ఎందుకు నిర్వహించాలో వివరించాడు వర్మ.

ఐపీఎల్​ జట్లు

"దుబాయ్​ రగ్బీ సెవెన్స్​ మ్యాచ్​ యూఏఈలో చాలా పెద్ద ఈవెంట్​. కానీ నవంబరులో జరగాల్సిన ఈ మ్యాచ్​ను అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. అలాంటప్పుడు ఐపీఎల్​ను అక్కడ ఎలా నిర్వహిస్తాం?. అందుకే దాదాకు రాసిన లేఖలో ఐపీఎల్​ను భారత్​లోనే జరపాలని కోరా."

-ఆదిత్యా వర్మ

యూఏఈలో మూడు వేర్వేరు జోన్లలో మ్యాచ్​లు నిర్వహించడం కంటే.. మంబయి వంటి మహానగరంలో బయో బబుల్​ విధానంతో లీగ్​ జరపడం ఎంతో సులభమని వర్మ ఉద్ఘాటించాడు. అలాగే లక్ష కంటే తక్కువ కేసులున్న దుబాయ్​తో పోలిస్తే.. విదేశీ ఆటగాళ్లు భారత్​ ప్రయాణించే విషయంలో జాగ్రత్తగా ఉంటారని అన్నాడు. "లీగ్​లో 60 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో వారు రావడానికి ఇష్టపడకపోతే.. ఆ స్థానంలో భారత ఆటగాళ్లను భర్తీ చేయొచ్చు" అని వర్మ తెలిపారు.

ఐపీఎల్ విజేతలు

ABOUT THE AUTHOR

...view details