తెలంగాణ

telangana

ETV Bharat / sports

'చారిత్రక విజయానికి పదేళ్లు- గత స్మృతుల్లో క్రికెటర్లు'

టీమ్​ఇండియా 2011 ప్రపంచకప్ నెగ్గి నేటికి సరిగ్గా పదేళ్లు అవుతోంది. కానీ, ఆ జ్ఞాపకాలు మాత్రం నేటికీ మన మనసుల్లో కదలాడుతున్నాయి. ఈ సందర్భంగా ట్విట్టర్​ వేదికగా బీసీసీఐతో పాటు భారత మాజీలు గత స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు.

By

Published : Apr 2, 2021, 1:31 PM IST

A decade later, still fresh in our minds: BCCI recalls India's 2011 WC triumph
'విజయానికి శతాబ్దమైనా.. గత స్మృతులు తాజాగానే'

టీమ్​ఇండియా 2011 ప్రపంచకప్ గెలుపొంది పదేళ్లు అవుతున్న సందర్భంగా బీసీసీఐ గత స్మృతులను గుర్తు చేసుకుంది. ఒక దశాబ్దం తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగా ఉన్నాయని తెలిపింది.

"2011లో ఇదే రోజు టీమ్​ఇండియా చరిత్ర సృష్టించింది. రెండో సారి ప్రపంచకప్​ను కైవసం చేసుకుంది' అని బీసీసీఐ ట్వీట్​ చేసింది. 2011 వరల్డ్​కప్​ ఫైనల్​లో మీకిష్టమైన క్షణం ఏది? అని పోస్టు చేసింది.

"మేము భారతదేశం కోసం, సచిన్ తెందుల్కర్ కోసం ప్రపంచకప్​ గెలవాలనుకున్నాం. అంచనాలను అందుకున్నాం. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం"

-యువరాజ్​ సింగ్, మాజీ క్రికెటర్.

"ఏప్రిల్ 2, 2011 అనేది తన జీవితంలో, కెరీర్​లో చాలా ముఖ్యమైన రోజు. ఇది కేవలం మా విజయం మాత్రమే కాదు. ఇది మొత్తం భారత్​ గెలుపు" -హర్భజన్ సింగ్, టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్.

"పదేళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన.. జీవిత కాల క్షణం" -వీరేంద్ర సెహ్వాగ్​, మాజీ ఓపెనర్.

"2011 ప్రపంచకప్​ గెలిచి పదేళ్లు అవుతున్న సందర్భంగా ప్రజలందరికీ, నా సహచరులకు శుభాకాంక్షలు" -సచిన్ తెందుల్కర్, మాజీ క్రికెటర్.

"2011లో ఈ రోజు నా కల నిజమైన రోజు" -మునాఫ్ పటేల్, మాజీ బౌలర్.

"భారత ప్రజలు ప్రపంచకప్​ గెలుపొందిన రోజు, జైహింద్​" -గౌతమ్​ గంభీర్, మాజీ ఓపెనర్.

ఇదీ చదవండి:పదేళ్ల క్రితం ఇదే రోజు విశ్వవిజేతగా భారత్​

ABOUT THE AUTHOR

...view details