తెలంగాణ

telangana

ఇంగ్లాండ్​ X టీమ్​ఇండియా: మూడో వన్డే వేదిక మార్పు!

భారత్-​ఇంగ్లాండ్​ మధ్య జరగబోయే మూడో వన్డే వేదికను పుణె నుంచి ముంబయికి తరలించే అవకాశముందని తెలిపింది మహారాష్ట్ర క్రికెట్​ అసోసియేషన్​. ప్రస్తుతం ఈ విషయమై బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.

By

Published : Feb 19, 2021, 5:35 AM IST

Published : Feb 19, 2021, 5:35 AM IST

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ X టీమ్​ఇండియా: మూడో వన్డే వేదిక మార్పు!

third odi
మూడో వన్డే

మార్చి 28న ఇంగ్లాండ్​తో జరగాల్సిన మూడో వన్డే వేదికను మార్చే అవకాశముంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్​ అసోసియేషన్​ స్డేడియంలో జరగాల్సిన ఈ మ్యాచును ముంబయికి తరలించవచ్చు. ఈ విషయాన్ని సదరు క్రికెట్​ స్డేడియం నిర్వాహకులు తెలిపారు. ఈ విషయమై బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఈ మ్యాచ్​తోనే ఇరు జట్లు మధ్య అన్ని ఫార్మాట్ల సిరీస్​ పూర్తి కానుంది. ముంబయిలో మ్యాచ్​ జరిగితే.. ఈ పోరు ముగిసిన అనంతరం ప్రత్యర్థి జట్టు నేరుగా తమ దేశానికి బయలుదేరే వెసులుబాటు ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు క్రికెట్​ స్డేడియం అధికారులు తెలిపారు. కాగా, ఇరు జట్లు నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడుతున్నాయి. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తవ్వగా.. ఇరు జట్లు 1-1తో సిరీస్​ను సమం చేశాయి.

ఇదీ చూడండి:ఐపీఎల్ వేలం: రికార్డు సృష్టించిన మోరిస్, మెరెడిత్, కృష్ణప్ప

ABOUT THE AUTHOR

...view details