తెలంగాణ

telangana

పురుష క్రికెట్​లో అంపైర్​గా 23 ఏళ్ల అమ్మాయి

By

Published : Oct 24, 2019, 1:46 PM IST

దక్షిణాఫ్రికాకు చెందిన 23 ఏళ్ల ​లారెన్​ ఏజెన్​బాగ్​.. తొలిసారి ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​లకు అంపైర్​గా వ్యవహరించింది. జోహె జోహన్స్​​​బర్గ్ వేదికగా అక్టోబర్​ 17 నుంచి 19 వరకు సెంట్రల్ గౌటెంగ్ లయన్స్-బోలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల మ్యాచ్‌కు ఈమె నిర్ణేతగా బాధ్యతలు చేపట్టింది.

పురుష క్రికెట్​లో అంపైర్​గా 23 ఏళ్ల అమ్మాయి

ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో అంపైరింగ్​ బాధ్యతలు చేపట్టిన దక్షిణాఫ్రికా తొలి మహిళగా చరిత్ర సృష్టించింది 23 ఏళ్ల క్రికెటర్​ లారెన్​ ఏజెన్​బాగ్. ఈ ఏడాది అక్టోబర్​ 17 నుంచి 19 వరకు జోహన్స్​బర్గ్​ వేదికగా సెంట్రల్ గౌటెంగ్ లయన్స్-బోలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు రోజులు మ్యాచ్‌లు జరిగాయి. వీటికి ఈమే మైదాన నిర్ణేతగా వ్యవహరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తొలిసారిటీ20లకు అంపైరింగ్​ చేసి వార్తల్లో నిలిచింది.

23 ఏళ్ల లారెన్​ ఏజెన్​బాగ్​

పురుషుల క్రికెట్​కు...

సఫారీ జట్టు పురుషుల ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లకు అంపైర్‌గా లారెన్‌ ఏజెన్‌బాగ్‌కు బాధ్యతలు అప్పజెప్పింది అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ). ఈ ఘనత సాధించిన తొలి మహిళా ప్రోటీస్​ అంపైర్‌గా కొత్త అధ్యాయం లిఖించింది లారెన్​. దక్షిణాఫ్రికాలో స్టాండర్డ్‌ మహిళా అంపైర్‌గా తన బాధ్యతలు నిర్వర్తిసున్న ఈ మాజీ క్రీడాకారిణిపై... ఆ దేశ క్రికెట్‌ బోర్డు తాత్కాలిక డైరెక్టర్‌ కోరీ వాన్‌ జిల్‌ ప్రశంసలు కురిపించాడు.

"తన ప్రతిభను ప్రపంచానికి చూపించిన లారెన్‌ అంకితం భావంతో మరింత రాణించాలని కోరుకుంటున్నా. మిగతా మహిళా క్రికెటర్లకు ఆమె ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది".
--తాత్కాలిక డైరెక్టర్‌ కోరీ వాన్‌ జిల్‌, దక్షిణాఫ్రికా బోర్డు

ఐసీసీ మహిళా అంపైర్ల ప్యానల్‌లో సభ్యురాలిగా ఉన్న లారెన్‌... గత నెలలో జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ ఫైనల్‌ సహా పలు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లకు నిర్ణేతగా వ్యవహరించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details