తెలంగాణ

telangana

By

Published : Jun 30, 2020, 4:23 PM IST

ETV Bharat / sports

'ఆ టెస్టు సిరీస్​ మాకు ఎంతో నేర్పించింది'

2014లో అడిలైడ్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్​ను ట్విట్టర్​ వేదికగా గుర్తు చేసుకున్నాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. ఆ టోర్నీ తమకు ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపాడు.

2014 Adelaide Test remain very important milestone in our journey as Test side: Kohli
ఆ టెస్టు సిరీస్​ మాకు ఎంతో నేర్పించింది:కోహ్లీ

అడిలైడ్​ వేదికగా 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​ తమకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపాడు టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ. ట్విట్టర్​ వేదికగా అప్పటి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ.. ఆ మ్యాచ్​ ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నాడు.

"మన ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమైన, ముఖ్యమైన ఓ టెస్టు సిరీస్​ను గుర్తు చేసుకుందాం. 2014లో అడిలైడ్​ వేదికగా జరిగిన టెస్టు ఇరు జట్లకు ఎంతో భావోద్వోగభరితమైంది. ప్రేక్షకులకు కూడా మరపురాని అనుభూతులనిచ్చింది. ఆ సిరీస్​ మాకు ఎంతో నేర్పించింది. మన మనస్సు ఏదైనా సాధించాలనుకుంటే అది సాధ్యమవుతుంది. మొదట ప్రారంభించడానికి కష్టంగా అనిపించినప్పటికీ.. చివరకు పూర్తి చేస్తాం. మనందరం వాటికి కట్టుబటి ఉన్నాం. టెస్టు సిరీస్​ పరంగా ఈ టోర్నీ మాకు ఎల్లప్పుడూ ఒక మైలురాయిగా నిలుస్తుంది."

-విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

2014 డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటనలో.. భారత్​ నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ఆడింది. అడిలైడ్​​లో జరిగిన టెస్టులో ఇరుజట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. కోహ్లీ ఈ మ్యాచ్​లో రెండు సెంచరీలు చేసినప్పటికీ.. మైకేల్​ క్లర్​ సారథ్యంలోని ఆసీస్​ జట్టు 48 పరుగులు తేడాతో విజయాన్ని దక్కించుకుంది. తొలి ఇన్నింగ్స్​లో 115 పరుగులతో పాటు.. రెండో ఇన్నింగ్స్​లో 141 పరుగులు సాధించాడు విరాట్. ఈ సిరీస్​ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి:ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కరోనా నెగిటివ్​

ABOUT THE AUTHOR

...view details