తెలంగాణ

telangana

By

Published : Dec 23, 2019, 3:29 PM IST

Updated : Dec 23, 2019, 4:00 PM IST

ETV Bharat / sports

మిస్టర్ కూల్ క్రికెట్ ప్రస్థానానికి 15 ఏళ్లు

2004లో అనామక క్రికెటర్​గా అడుగుపెట్టి అంచెలంచెలుగా నాయకుడి స్థాయికి ఎదిగిన క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోని​. విధ్వంసకర బ్యాటింగ్​, బంతిని దాటి వెళ్లకుండా ఆపగలిగే కీపింగ్​ అస్త్రాలయితే.. ఎంత ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉంటూ ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేయగల నేర్పరితనం ఇతడి సొంతం. అందుకే 1983లో తొలిసారి ప్రపంచకప్​ గెల్చిన తర్వాత.. 28 ఏళ్లకు మళ్లీ ఇతడి సారథ్యంలోనే భారత్​కు కప్పు వచ్చింది. అలాంటి స్టార్​ క్రికెటర్​ అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టి నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అతడి కెరీర్​లో కొన్ని విశేషాలు చూద్దాం.

15YearsMSDhoni
క్రికెట్​ ప్రపంచంలో 15 ఏళ్ల ధోని ప్రస్థానం..

కూల్‌గా ఆడుతూ.. బంతులను బౌండరీలు దాటిస్తూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ.. అభిమానులను మాయ చేసే క్రీడాకారుడు మహేంద్ర సింగ్​ ధోని. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా మిస్టర్​ కూల్​గా వ్యవహరిస్తూ ఆటను మలుపు తిప్పడంలో దిట్టగా పేరుతెచ్చుకున్నాడు. తన కెప్టెన్సీతో అభిమానులకు మరచిపోలేని అనుభూతిని ఇచ్చాడు మహీ. అలాంటి క్రికెటర్​ అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టి నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తోన్న ఈ ఝార్ఖండ్​ డైనమైట్​ కెరీర్​ విశేషాలు ఇవిగో...

మహేంద్ర సింగ్​ ధోని

2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్​తో జరిగిన వన్డేతో తన క్రికెట్ ప్రస్థానం ప్రారంభించాడు మహేంద్ర సింగ్​ ధోని.

  • ధోని ఆడిన తొలి మ్యాచ్​లోనే సున్నా పరుగులకు రనౌటై​ నిరాశపర్చాడు.
  • ధోని కెప్టెన్​గా ఉన్నప్పుడే అత్యధికంగా ఐసీసీ ట్రోఫీలు భారత్​ సొంతం చేసుకుంది.
  • ఇప్పటివరకు 350 అంతర్జాతీయ వన్డేలు ఆడాడు మిస్టర్ కూల్​.

2004లో సౌరభ్​ గంగూలీ భారత్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న సమయంలో ధోని అంతర్జాతీయ క్రికెట్​లో అరంగ్రేటం చేశాడు. వికెట్​ కీపర్​గా, బ్యాట్స్​మన్​గా రాణించాడు.

గంగూలీ,ధోని

కెరీర్​ ప్రారంభంలో వెనుకంజ

కెరీర్​ ప్రారంభంలో ధోని అంతగా రాణించలేకపోయాడు. మైదానంలోకి వెళ్లిన కొద్ది సమయంలోనే అవుటై బయటకు వచ్చేసేవాడు. బంగ్లాదేశ్​తో జరిగిన 3 మ్యాచ్​ల సిరీస్​లో కేవలం 19 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు.

పాక్​తో సిరీస్ మలుపుతిప్పింది

2005లో పాకిస్థాన్​తో జరిగిన సిరీస్​లో అసలైన ధోని అభిమానులకు పరిచయమయ్యాడు. విశాఖలో జరిగిన వన్డేలో​ కెప్టెన్​​ గంగూలీ ధోనీని మూడో స్థానంలో బ్యాటింగ్​కు దిగమని సలహా ఇచ్చాడు. పాక్​​తో జరిగిన ఈ మ్యాచ్​లో ధోని ఏకంగా 123 బంతులకు 148 పరుగులు చేశాడు. అప్పటి నుంచి మహీ తన కెరీర్​లో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ట్రోఫీల పంట

2007 వరకు టీమిండియాపై ఉన్న అంచనాలను ధోని మార్చేశాడు. మహీ కెప్టెన్​గా ఉన్నప్పుడు 3 మేజర్​ ఐసీసీ టోర్నీల్లో( 2011లో ప్రపంచకప్​, 2007లో టీ20 వరల్డ్​ కప్​, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ)విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది భారత్.

మూడు ఐసీసీ ట్రోఫీలతో మహీ

ట్రాక్​ రికార్డు

ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్​లో 538 మ్యాచ్​లు ఆడిన ధోని 17వేల 266 రన్స్​ చేశాడు. సగటు 44.95తో పరుగులు చేసిన మహీ... 16 శతకాలు, 108 హాఫ్​ సెంచరీలు సాధించాడు. కీపర్​గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కెరీర్​లో 829 మందిని ఔట్ చేశాడు మిస్టర్​కూల్​. ఇందులో 634 క్యాచ్​లు, 195 స్టంప్​ ఔట్​లు ఉన్నాయి. 12 సీజన్ల ఐపీఎల్​ టోర్నీలో చెన్నై సూపర్​ కింగ్స్​ను 3 సార్లు విజేతగా, 5సార్లు రన్నరప్​గా నిలిపాడు.

అంతర్జాతీయ మ్యాచ్​లకు దూరం

ప్రస్తుతం ధోని క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. ​ప్రపంచకప్-2019లో​​ సెమీ ఫైనల్​ మ్యాచ్ మహీకి చివరిది. వరుసగా సిరీస్​లకు దూరంగా ఉంటున్న ఈ ఆటగాడి రిటైర్మెంట్​పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై ఇప్పటివరకు ధోని ఏం మాట్లాడలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్​లో కనువిందు చేసే అవకాశముంది. వీలైతే ఆ తర్వాత జరగనున్న టీ20 ప్రపంచకప్​లోనూ చోటు దక్కించుకోవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.

Last Updated : Dec 23, 2019, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details