తెలంగాణ

telangana

ETV Bharat / sports

మిథాలీ స్థానంలో 15 ఏళ్ల యువకెరటం - bcci

టీ20 ఫార్మాట్​కు భారత మహిళా క్రికెటర్​ మిథాలీ రాజ్​ గుడ్​బై చెప్పేయడం వల్ల ఆ స్థానంలో ఓ యువతేజం అరంగేట్రం చేయనుంది. దూకుడైన బ్యాటింగ్​తో ఆకట్టుకునే 15 ఏళ్ల షెఫాలీ వర్మ టీమిండియాలో చోటు దక్కించుకుంది.

మిథాలీ స్థానంలో 15 ఏళ్ల యువకెరటం

By

Published : Sep 6, 2019, 12:04 PM IST

Updated : Sep 29, 2019, 3:19 PM IST

టీమిండియామహిళా జట్టులో ఓ యువ కెరటం చోటు దక్కించుకుంది. టీ20లకు వీడ్కోలు చెప్పిన సీనియర్​ బ్యాట్స్​ఉమెన్​ మిథాలీరాజ్​ స్థానంలో 15 ఏళ్ల షెఫాలీ వర్మ ఆడనుంది. మహిళల టీ20 ప్రీమియర్​ లీగ్ ఛాలెంజ్​​లో మిథాలీ సారథ్యంలోనే ఆడిన ఈ యువ క్రికెటర్​... దూకుడైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. దేశవాళీ టోర్నీల్లోనూ సత్తా చాటి, త్వరలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​లో అరంగేట్రం చేయనుంది. గురువారం ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా మూడు మ్యాచ్​లకు జట్టును ప్రకటించింది సెలక్షన్​ కమిటీ. ఇందులో షెఫాలీకి అవకాశం లభించింది.

దేశవాళీ క్రికెట్‌, అండర్‌-23లో 150కి పైగా స్ట్రైక్​ రేట్‌తో పరుగులు చేసింది షెఫాలీ. అండర్​-19 టోర్నీలోనూ విధ్వంసకర ఆటతో 5 ఇన్నింగ్స్​ల్లో 376 పరుగులు చేసింది. అలాగే ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్​ చేయగలదు.

రెండో పిన్నవయస్కురాలు..

హరియాణాకు చెందిన 15 ఏళ్ల షెఫాలీ... భారత మహిళా క్రికెట్​లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన రెండో అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. అంతకు ముందు గ్రెయిగ్​ బెనర్జీ 14 ఏళ్ల 165 రోజులకే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది.

వన్డేలకు మిథాలీ, టీ20లకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథులుగా కొనసాగుతున్నారు. సఫారీ జట్టుతో ఈనెల 24 నుంచి టీ20 సిరీస్​, వచ్చే నెల 9 నుంచి వన్డే సిరీస్​ ఆరంభంకానున్నాయి.

ఇదీ చదవండి...యూఎస్​ ఓపెన్​: ఫైనల్​లో సెరెనాX ఆండ్రిస్కూ

Last Updated : Sep 29, 2019, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details