చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు శివమ్ దూబె, దీపక్ చాహర్ ఒకరినొకరు వాదించుకున్నారు! వీరిద్దరి మధ్య ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫన్నీ వార్ జరిగింది. ఒక ఓవర్ బౌలింగ్ చేసి.. ఎవరి గెలుస్తారో చూసుకుందాం అంటూ శివమ్ దూబెకు, చాహర్ సోషల్ మీడియాలో సవాల్ విసిరాడు. దీనికి స్పందించిన దూబె ఏమన్నాడంటే..
శివమ్ దూబె తన ఆల్ టైమ్ 11 చెన్నై తుది జట్టును చెప్పిన వీడియోను సీఎస్కే ఫ్రాంచైజీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అయితే దూబె.. చెన్నై జట్టుకు ఇదివరకు ఆడిన.. ఇప్పుడు ఆడుతున్న ప్లేయర్ల నుంచి 11 మందిని ఎంపిక చేస్తూ.. వీడియోలో కనిపించాడు. అందులో ముందుగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు మ్యాథ్యూ హేడెన్, మైకెల్ హస్సీను ఓప్నర్లుగా ఎంచుకున్నాడు. తర్వాత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ, రవింద్ర జడేజా, హర్భజన్, లక్ష్మీపతి బాలాజీ, డ్వేన్ బ్రావో, అల్బీ మోర్కెల్ ఇలా వరుసగా 10 మంది పేర్లు చెప్పాడు. ఇక 11వ ప్లేయర్గా తన పేరును చెప్పుకొని.. కెప్టెన్గా ధోనీని ఎంచుకున్నాడు దూబె.